దీపావళి అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. దీపావళి వచ్చిందంటే పేద, ధనిక తేడా లేకుండా అందరూ తమ శక్తి మేరకు టపాసులు కొనుక్కుంటారు. మధ్యతరగతి వ్యక్తులు గట్టిగా 2 వేలు నుంచి 3 వేలు పెట్టి టపాసులు కొనుక్కుంటారు. ఇంకా ఆర్థిక ఓపిక ఉంటే 5 వేలు నుంచి 10 వేలు పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఏదో రకంగా మేనేజ్ చేసి అంత డబ్బు పెట్టి టపాసులు కొనుక్కోగా లేనిది.. డబ్బున్న వాడు లక్షల్లో పెట్టి దీపావళి షాపింగ్ చేయలేడా? బండ్ల గణేష్ కూడా అదే చేశారు. లక్షల్లో దీపావళి షాపింగ్ చేసి హాట్ టాపిక్ ఆఫ్ సోషల్ మీడియా అయిపోయారు. బండ్ల గణేష్ ఏం చేసినా భారీగానే ఉండాలని అనుకుంటారు. సినిమా చేసినా భారీ కాస్ట్ ఉండాలి, భారీ ప్రొడక్షన్ కాస్ట్ ఉండాలి, భారీ ప్రాజెక్ట్ అయి ఉండాలి అని అంటూ ఉంటారు.
ఏ విషయంలో అయినా తన రేంజ్ వేరు అని మాట్లాడుతూ ఉంటారు. తాజాగా దీపావళి విషయంలో కూడా తన రేంజ్ వేరే అని నిరూపించారు బండ్ల గణేష్. ఏకంగా 4 లక్షలు పైనే ఖర్చు పెట్టి దీపావళి టపాసులు కొనేశారు. రూ. 4,02,340 ఖర్చు పెట్టి దీపావళి షాపింగ్ చేశారు. దీంతో బండ్ల గణేష్ కి టపాసులంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. తాను ప్రతీ దీపావళికి ఇలానే లక్షలు పెట్టి భారీగా టపాసులు కొంటారు. ఈ క్రమంలో ఆయన 2020, 21, 22 సంవత్సరాల్లో కొన్న టపాసులకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంటి బయట ఆవరణలో 2020లో కొన్న టపాసులను, 2021లో కొన్న టపాసులను, 2022లో కొన్న టపాసులను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు కాస్తా బాగా వైరల్ అయ్యాయి. ‘ఊరు మొత్తం కాల్చే పటాసులన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి కదా బండ్లన్న’ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బండ్లన్న ఈ టపాసులు కేవలం తన కోసం మాత్రమే కాదని, తన సినీ స్నేహితులకి, సన్నిహితులకు బహుమతిగా ఇవ్వడానికి ఇంత ఖర్చు పెట్టి కొన్నానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
₹4,02,340 Bandlanna Mass 💥🔥 pic.twitter.com/lPZmOfOEbh
— Sarcastc_Tweets (@Sarcastc_Tweets) October 24, 2022