గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మా ఎన్నికల ఓటింగ్ నేడు జరుగుతుంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇద్దరు ప్యానెల్ లోని సభ్యులు ఓటింగ్,నటులు అందరూ ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. అధ్యక్షపోటీలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరినొకరు కాసేపు మాట్లాడుకున ఎన్నికల గురించి మాట్లాడుకున్నారు. అయితే ఓటింగ్ భాగంగా పాల్గొన్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఈయనతో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.