తెలుగు స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. తనకంటూ ఒక జోనర్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు బోయపాటి. నందమూరి నటసింహం బాలయ్యతో అఖండ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించారు . డిసెంబర్ 2 న ప్రేక్షలు ముందుకు అఖండ సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో హ్యట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే ఇదే సమయంలో నిన్న జరిగిన అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి మాట్లాడిన మాటలు బాలయ్య అభిమానులను టెన్షన్ పెటిస్తున్నాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు బోయపాటి శ్రీనును ట్రోల్ చేశారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా హిట్ తర్వాత ఈ సినిమా రామ్ చరణ్ కు మైనస్ గా నిలిచిందనే భావన అందరిలో ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంలో కూడా బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు. గుండెల మీద చెయ్యి వేసుకుని అభిమానులు వినయ విధేయ రామ సినిమా చూడవచ్చని శ్రీను స్టేట్ మెంట్ ఇచ్చారు. మోగా అభిమానులు తనను నమ్మాలని బోయపాటి శ్రీను తెలిపారు. అయితే ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చింది. అప్పట్లో బోయపాటి స్పీచ్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి.
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి మాటలు రిపీట్
అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బోయపాటి నోట అలాంటి మాటలు రావటం గమనార్హం. అఖండ సినిమాను గుండెల మీద చెయ్యేసుకుని చూడండంటూ బోయపాటి చేసిన కామెంట్లు బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. బోయపాటి శ్రీను అఖండ ఈవెంట్ స్పీచ్ వినయ విధేయ రామ స్పీచ్ ను గుర్తుకు తెచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అఖండ ట్రైలర్ మంచి విజయం సాధించింది కాబట్టి, సినిమా కూడా పెద్ద ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందనే మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బోయపాటి శ్రీను చేసిన కామెంట్స్ మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.