కొంతమంది పనినే దైవంగా భావిస్తారు. పనిని దైవంగా భావిస్తే పనికొస్తారు, పైకొస్తారు అని నమ్ముతారు. ఈ విషయంలో సినిమా యాక్టర్లు మరీ కఠినంగా ఉంటారు. తమ ఒంటికి గాయాలైనా లెక్క చేయకుండా పని చేస్తుంటారు. అందుకు మెగాస్టార్ చిరంజీవినే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి ఫుల్ ఫీవర్ ఉన్నా కూడా ఆరోజు పాటకి డ్యాన్స్ వేసి పాట చిత్రీకరణ పూర్తయ్యేలా సహకరించారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యింది. అట్లుంటది మన హీరోల డెడికేషన్. తాజాగా నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కూడా తన రంగం మీద ఉన్న ప్రేమతో తన సినిమా ప్రెస్ మీట్ కి ఏకంగా అంబులెన్స్ లో వచ్చారు. అంబులెన్స్ లో నేరుగా హైదరాబాద్ ప్రెస్ మీట్ కి వచ్చారు. ఆయన్ని కొంతమంది స్టెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తమ భుజాల మీద మోసుకుంటూ ప్రెస్ మీట్ హాలులోకి తీసుకెళ్లారు. పృథ్వీరాజ్ కింద కూలబడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు. రెండు నిమిషాల తర్వాత ఆయన పైకి లేచి మైక్ అందుకుని సినిమా గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “మెడికల్ మాఫియా ఒక కామన్ మేన్ జీవితాన్ని ఎంతలా నలిపేస్తుందో, ఆ మాఫియాని ఎలా ఎదుర్కోవాలి అన్న పాయింట్ తో చాలా ఆసక్తిగా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తీయడం జరిగింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి. ఈ సినిమా కోసం నేను పది రోజుల్లో పది కేజీలు తగ్గాను. మా సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తే మా సినిమా యూనిట్ కి బలం చేకూరుతుంది” అని పృథ్వీరాజ్ అన్నారు.
ఈ మూవీ గురించి అందరికీ తెలిసేలా చేయడం కోసమే.. ఆయన అంబులెన్స్ లో రావడం, స్టెచర్ మీద పడుకోవడం, కష్టంగానే పైకి లేచి మాట్లాడడం చేశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమే అయినా కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలన్నదే వారి తాపత్రయం. ఇందులో నెగిటివ్ గా తీసుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ నిజంగా తీవ్రమైన జ్వరం ఉండి, చిన్న చిన్న గాయాలు ఉన్నా కూడా షూటింగ్ లకి వెళ్తారు, ప్రెస్ మీట్ లకి వస్తారు. మూవీని కంప్లీట్ చేస్తారు, మూవీని ప్రమోట్ చేస్తారు. నటుల డెడికేషన్ ఇట్లానే ఉంటుంది. సినిమాని నమ్ముకున్నారు కాబట్టి.. జనాల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి సినిమాలో నటించినట్టే బయట కూడా నటించాలి. దాన్నే పబ్లిసిటీ స్టంట్ అంటారు. ఈ మధ్య కాలంలో తమ సినిమాలని ప్రమోట్ చేసుకునేందుకు హీరోలు, నటులు పబ్లిసిటీ స్టంట్ కి పాల్పడి సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు.
ఆ దారిలోనే నటుడు పృథ్వీరాజ్ కూడా తన మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేశారు. ఇంతకే మూవీ పేరు ఏంటంటే.. ‘బలమెవ్వడు’. సనాతన దృశ్యాలు బ్యానర్ పై.. ధృవన్ కటకం హీరోగా, నియా త్రిపాఠి హీరోయిన్ గా.. సత్య రాచకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆర్.బి. మార్కండేయులు నిర్మించారు. పృథ్వీరాజ్, సుహాసిని, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రావణ్ భరత్, మోహన్ కాంత్, జబర్దస్త్ అప్పారావు, మణి మహేష్ తదితరులు నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ ని ఎం.ఎం. కీరవాణి పాడడం విశేషం. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మూవీ ప్రమోషన్ కోసం బబ్లూ పృథ్వీరాజ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.