తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూసర్స్ కి బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో అదిరిపోయే అందాల షో చేస్తూ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషు. అయితే.. బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బోల్డ్ బ్యూటీ, ఇటీవల బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో కూడా పాల్గొని సందడి చేసింది. అషు రెడ్డి ఎక్కడున్నా మినిమమ్ గ్లామర్ షో గ్యారంటీ అనిపించుకుంది. ఇదివరకు పర్సనాలిటీ పరంగా లావుగా కనిపించిన అషు.. ఈ మధ్యే బరువు తగ్గి సన్నగా, నాజూకుగా మారింది.
ఇక నాజూకుగా మారాక అషు అందాల విందులో హద్దులన్నీ చెరిపేసిందనే చెప్పాలి. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అషు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన గ్లామర్ తోనే ఈ మధ్య బుల్లితెర ప్రోగ్రాంస్ తో పాటు అడపాదడపా సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది అషు. ఓవైపు ప్రోగ్రామ్స్ చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది అషు. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్, నెటిజెన్స్ అందరికి దిమ్మతిరిగే ప్రశ్న అడుగుతూ.. కొత్త ఫోటోలు షేర్ చేసింది. అషు రెడ్డి ఫోటోలు పోస్ట్ చేయడం అనేది కొత్త కాదు. గతంలో రాహుల్ సిప్లిగంజ్, రామ్ గోపాల్ వర్మలతో కూడా ఫోటోలు పెట్టి వైరల్ అయ్యింది.
ఇప్పుడు తాజా ఫోటోల విషయానికి వచ్చేసరికి.. బోల్డ్ ఫోటోలు పెట్టడమే కాకుండా బోల్డ్ ప్రశ్న కూడా అడిగేసింది. ఈ ఫొటోలో నా ఒంటిపై పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయో చెప్పండి అంటూ ఫ్యాన్స్ కి చిలిపి సవాల్ విసిరింది. ఈ ప్రశ్నతో అషు గ్లామర్ చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ఫ్యాన్స్.. నీ ఒంటిపై ముచ్చటగా మూడు పుట్టుమచ్చలు కనిపిస్తున్నాయని కామెంట్స్ లో చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం అషు రెడ్డి విసిరిన ఈ చిలిపి సవాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదీగాక రీసెంట్ గా బ్లాక్ స్విమ్ సూట్ లో అషు అందాలను ఆరబోసి ట్రెండ్ అయిన విషయం విదితమే. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న అషు బోల్డ్ ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.