సినిమా టిక్కెట్ రేట్లపై హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఆయనకు తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయా అంటే.. అవుననే అనిపిస్తుంది. సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గినా నాకు ఏం కాదు అంటూ నాగాన్జున చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి. ఇప్పటికే ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమా టిక్కెట్లు అమ్మలేమంటూ థియేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో.. నాగార్జున తన వ్యాఖ్యలతో వారికి మరింత ఆగ్రహం కలిగించాడు.
ఇది కూడా చదవండి : ‘RRR’ కారణంగా NTR బాగానే నష్టపోయాడుగా..
ఈ క్రమంలో ఏపీ ఎగ్జిబిటర్లు నాగార్జునకు భారీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. సంక్రాతి సందర్భంగా విడుదల కానున్న బంగర్రాజు చిత్రాన్ని ఏపీలోని థియేటర్లలో ప్రదర్శించమని తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి థియేటర్ల యాజమాన్యం ట్విటర్ లో ఓ ప్రకటన చేశారు. బంగర్రాజు సినిమా బదులు అఖండ, పుష్ప ఇతర చిన్న సినిమాలనే కొనసాగిస్తామని తెలిపారు. మరి ఏపీ ఎగ్జిబిటర్ల నిర్ణయంపై నాగార్జున ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Some AP Exhibitors Serious on #Nagarjuna comments on ticket rates issue
Some Theatres Owners & Exhibitors don’t want to screen #Bangarraju Movie
They want to continue with #Akhanda #Pushpa and other small budget films#Hero #Djtillu #NagaChaitanya
— TFI Movie Buzz (@TFIMovieBuzz) January 6, 2022
ఇది కూడా చదవండి : సినిమా టిక్కెట్ ధరలతో నాకేం ఇబ్బంది లేదు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు