95 ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు కొట్టుడు కొట్టింది. ఈ వేడుకల్లో ఉత్తమ ఒరిజనల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో భారతీయులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ను అభినందించారు.
95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాలలో భారతీయ పాట, అందులోనూ తెలుగు వారి పాట “నాటు నాటు” చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ల కల.. ఇండియన్ సాంగ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ గా రికార్డు సెట్ చేయాలని.. ఆ కలను ఈరోజు సాకారం అయింది. 2023 ఆస్కార్స్ లో నాటు నాటు సాంగ్ ఇండియాకి మర్చిపోలేని అనుభూతిని అందించింది. ప్రపంచదేశాల ఫిలిం మేకర్స్ పై ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభావం ఎలా పడిందో.. ప్రపంచ దేశాల ఆడియెన్స్ పై నాటు నాటు ప్రభావం ఆ స్థాయిలో పడింది అనడానికి ఇదే నిదర్శనం. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మనదేశానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజమౌళి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బృందాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్ ట్వీట్ చేశారు. అలానే రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రేక్షకులను ఈ పాట మంత్ర ముగ్దులను చేసిందని ఆయన పేర్కొన్నారు. “ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తీ, తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాతబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఇండియన్ మూవీకి ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది” అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
“నాటునాటు” సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని ప్రశంసించారు. మన పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారికి గర్వకారణమని చెప్పారు. అలానే మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు వంటి తదితర ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. అలానే వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అన్నట్లు ఉంది. ఈ సినిమా భారత దేశ కీర్తిని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలానే తెలుగు వారు కాలర్ ఎగరేశేలా చేసింది.
జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలోని “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అలానే ప్రపంచ పటంపై జక్కన్న మెరిశారు. ఇక ఈ మూవీ టీమ్, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. వేదిక పైన ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్ మారుమోగిపోయింది. ఇక ఈ అవార్డును కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. ‘నమస్తే’ అంటూ ఆస్కార్ వేదికపై చంద్రబోస్, కీరవాణి ప్రత్యేకంగా నిలిచారు. మరి..ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ నాటుకోట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.
The #Telugu flag is flying higher!
I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv— YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023