సాధారణంగా బుల్లితెర యాంకరింగ్ తో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టిన వాళ్లు చాలామంది ఉంటారు. కానీ సినీ నటిగా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత టీవీ యాంకర్ గా మారిన వారిని తక్కువగా చూస్తుంటాం. అలాంటి తక్కువమందిలో ఒకరు ఉదయభాను. కరీంనగర్ కు చెందిన ఈ బ్యూటీ.. 15 ఏళ్ళ వయసులోనే ఎర్రసైన్యం సినిమాతో టాలీవుడ్ లో డెబ్యూ చేసింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలతో పాటు కన్నడ సినిమాలలో హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఇక 2004లో విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై.. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. యాంకర్ గా దాదాపు 25కు పైగా టీవీ ప్రోగ్రామ్స్ చేసి.. పలు అవార్డులను కూడా అందుకున్న ఉదయభాను.. లీడర్, జులాయి సినిమాల ఐటమ్స్ సాంగ్స్ లో మెరిసింది. అయితే.. సినీ సెలబ్రిటీల నుండి టీవీ యాంకర్స్ వరకూ అందరూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఏ స్థాయిలో వాడుకుంటున్నారో తెలిసిందే. వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంటారు.
యాంకర్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఉదయభాను.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పోస్టులు పెడుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ తో ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యేందుకు.. ఉదయభాను కొత్తగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తాజాగా ‘మీ ప్రేమే నా బలం’ అంటూ తన మొదటి యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన అభిమానులను ఉద్దేశించి ఉదయభాను మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
‘మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం.. నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యమై నిలిచింది మీరే.. మీ అభిమానంతో నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా మీ ఉదయభాను’ అని ఆమె మాట్లాడింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఉదయభాను యూట్యూబ్ ఛానల్ తో మళ్లీ యాక్టీవ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి యాంకర్ ఉదయభాను గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.