తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ సావిత్రిగా ఏపీ, తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్న శివజ్యోతి.. లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా భర్తతో కలిసి కొత్త కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శివజ్యోతి.. తీన్మార్ షోతో సావిత్రిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి మరింత పాపులర్ అయ్యింది. జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలతో అలరిస్తుంది. అప్పుడప్పుడు పలు టీవీ షోస్ లో కూడా పాల్గొంటుంది. ప్రస్తుతం శివజ్యోతి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. సంపాదన కూడా బాగా ఉండడంతో రీసెంట్ గా కొత్త ఇల్లు కూడా కొన్నది. ఆ ఇంట్లో ఖరీదైన కారు ఉంటే బాగుందనిపించి లగ్జరీ కారుని కొనుగోలు చేసింది.
దసరా సందర్భంగా వాహనాలు కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. ఈ విషయంలో సెలబ్రిటీలు ముందుంటారు. ఇప్పటికే బిత్తిరి సత్తి రేంజ్ రోవర్, షణ్ముఖ్ జస్వంత్ బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లని కొనుక్కుని తమ కలలను నిజం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో శివజ్యోతి కూడా చేరిపోయింది. తన కలల బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేసి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో కలిసి బీఎండబ్ల్యూ బ్లూ కలర్ కారుని కొనుగోలు చేసింది. దీంతో మూడు కార్లు అయినట్టు. మొదటిసారిగా 2017లో శివజ్యోతి భర్త పుట్టినరోజు సందర్భంగా ‘మారుతి సుజుకీ బాలెనో’ కారును కొనుగోలు చేసింది. ఆ తర్వాత బాలెనో కారుని అమ్మేసి హ్యుందాయ్ క్రెటా కారుని కొనుగోలు చేసింది. బ్లాక్ కలర్ కారు అది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.