రష్మీ గౌతమ్ యాంకర్ గా, నటిగానే కాదు.. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సెలబ్రిటీగా ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించుకుంది. మరోసారి సమాజం మీద తనకున్న బాధ్యతను రష్మీ బయటపెట్టింది. ఒక ఘటనపై తన గళాన్ని బలంగా వినిపించింది.
యాంకర్ రష్మీ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా షోస్ చేస్తూ.. హీరోయిన్ గా కూడా తనని తాను నిరూపించుకుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీ షోస్, స్పెషల్ ఈవెంట్స్ తో సందడి చేస్తుంటుంది. రష్మీ అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల విషయంలో ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. వాటికి ఎలాంటి హాని కలిగించవద్దని కోరుతుంటుంది. అలాగే సమాజంలో జరిగే చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటుంది.
సోషల్ ఇష్యూస్ పై రష్మీ తనదైనశైలిలో స్పందిస్తూ ఉంటుంది. నలుగురికి మంచి చెప్పాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు సమాజంలో జరిగే ఘోరాలు, అన్యాయాలపై కూడా తన గళాన్ని విపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ అమానవీయ ఘటనపై రష్మీ స్పందించింది. చెల్లికి రజస్వల అయితే.. ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుని కొట్టి చంపేశాడు. చెల్లికి పిరియడ్స్ వచ్చాయన్న విషయం తెలియకుండా అన్న కొట్టి చపండంపై రష్మీ ఎమోషనల్ అయ్యింది. మినిమం సె*క్స్ ఎడ్యుకేషన్ లేకనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంది. అందరికీ తప్పనిసరిగా సె*క్స్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది.
నిజానికి రష్మీ గౌతమ్ చెప్పిన మాట్లలు వందకు వందశాతం కరెక్ట్ అంటూ నెటిజన్స్ కూడా సమర్థిస్తున్నారు. రష్మీ ఎప్పుడూ సోషల్ కాజ్ కోసం తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అంటూ ప్రశంసిస్తున్నారు. రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలను కేవలం ఫ్యాన్స్ ని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా.. సమాజహితం కోసం కృషి చేస్తుంటుందని మెచ్చుకుంటున్నారు. కచ్చితంగా అందరికీ మినిమం సె*క్స్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వారి శరీరంలో వచ్చే మార్పుల గురించే కాదు.. ఆపోజిట్ సె*క్స్ వాళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా తెలుసుకోవాలి. అలాంటి అవగాహన లేకనే ఒక అన్న చెల్లికి పిరియడ్స్ వస్తే.. ఆమె చేయకూడని తప్పు చేసిందని భావించి ఆమెను పొట్టనపెట్టుకున్నాడు.