అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ.. ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా ఇంకా అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ‘‘రేపటి మహిళలు” అనే నినాదంతో వేడుకలు నిర్వహిస్తున్నారు. అనేక రంగాల్లో మహిళలు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ వారిని సన్మానిస్తుంటారు. అయితే ఈ మహిళా దినోత్సవంపై యాంకర్ అనసూయ తనదైనశైలిలో స్పందించింది.
ఏ కంగా మహిళా దినోత్సవాన్ని ఫూల్స్ డే అంటూ సంబోధించింది. నిత్యం మహిళలను కించపరుస్తూ కామెంట్ చేయడం, మీమ్స్ చేయడం, పోస్టులు పెట్టే వారంతా ఈ 24 గంటలు మాత్రం మహిళలను కీర్తిస్తూ పోస్టులు పెడతారు. ఆ తర్వాత ఈ రోజు గడిచిపోగానే అంతా మర్చిపోతారంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతేకాకుండా మహిళలందరికీ ఫూల్స్ డే శుభాకాంక్షలు అని పేర్కొంది. గుమ్మడికాయ దొంగలు అంతా తన ట్వీట్ పై స్పందిస్తారంటూ చురకలు కూడా వేసింది. యాంకర్ అనసూయ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022