‘అనసూయ భరద్వాజ్’ ఈ పేరుకు ప్రత్యేక ఎలివేషన్స్, ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులే కాదు, వెండితెర ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితురాలు. రంగస్థలం, పుష్ప సినిమాలతో తన యాక్టింగ్ లెవల్ ఏంటో ప్రూవ్ చేసింది. కానీ, అనసూయపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమె చెప్పే సమాధానాలు, పోస్టులపై మీమర్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా మహిళా దినోత్సవం రోజు కూడా అనసూయ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. మీమర్స్ ను టార్గెట్ చేస్తూ ‘రోజూ కామెంట్స్, ట్రోల్స్ చేసే వాళ్లంతా ఈ రోజు మహిళలకు ఎక్కడలేని మర్యాద ఇస్తారు. శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ, అదంతా ఈ 24 గంటలు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.. హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి: బాలకృష్ణపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022
అనసూయ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. మీమర్స్ అందరూ అనసూయను, ఆమె చేసే కామెడీ షోలను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. అయితే అనసూయకు సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎంత ఉందో.. అభిమానులు కూడా అంతే మంది ఉన్నారు. ఆమె పేరు మీద లెక్కలేనన్ని ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. వారంతా ఆ రోజు ఆమెను ఎంతో సపోర్ట్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ అనసూయ ఎమోషనల్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టింది.
‘నా ఫ్యాన్ పేజెస్ కు ధన్యవాదాలు. మీరంతా ఎంతో హుందాగా, బాధ్యతగా, జెన్యూన్ గా ఉన్నారు. ఎప్పుడూ విషయం తెలియకుడా మాట్లాడరు. ఎవరినీ బాధపెట్టే పనులు చేయరు. ఎలాంటి రాజీ లేకుండా మీరు నన్ను అభిమానుస్తూ వస్తున్నారు. ఒకరితో పోలికలు పెట్టకుండా నా ముక్కుసూటి తనాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మీరే నా నిజమైన సైన్యం.. మీ వల్లే నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను’ అంటూ అనసూయ పోస్ట్ చేసింది. అనసూయ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.