ఆనంద్ మహీంద్రా.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఏ ప్రశ్నకైనా తనదైన శైలిలో బదులిస్తుంటారు.. మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన స్టైల్లో కామెంట్లు చేస్తారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించడం.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి ఈ వ్యాపారవేత చేస్తుంటారు. వ్యాపారంలో బిజీగా ఉంటు సమాజం గురించి ఆలోచించే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేశారు. తాజాగా సినిమాలపై తనకు ఆసక్తి గురించి వెల్లండిచారు. చిత్రనిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
టెక్ మహీంద్రా నిర్వహించిన ఓ ప్రత్యేక సెలబ్రేటింగ్ రైజ్ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు తదితరులు హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రా ఆహ్వానం మేరకు హీరో అడివి శేష్, డైరెక్టర్లు నాగ్ అశ్విన్, బోయపాటి శ్రీను, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మిథాలీ రాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. మరోవైపు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఆనంద్ మహీంద్ర సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Actor @AdiviSesh, Directors #BoyapatiSreenu & @nagashwin7 got a special invitation to Celebrating Rise – an event of Tech Mahindra.
Mr.@anandmahindra expressed his interest in films and venturing into film production.@tech_mahindra @MahindraRise pic.twitter.com/m7jziIHkiW— Eluru Sreenu (@IamEluruSreenu) July 25, 2022