ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ తుఫాన్ ముప్పు పొంచిఉంది. వందల ఎకరాలు పంటనష్టం.. ఆస్తినష్టం వాటిల్లింది. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చిత్తూరు, కడప జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా ఏపిలో వరద బాధితుల కోసం హీరోలు టాలీవుడ్ కదలి వస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు, యన్టీఆర్ వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాలపాలవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. వాళ్లకు తనవంతు సాయం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందజేస్తున్నానని తెలిపారు.
Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.
— Jr NTR (@tarak9999) December 1, 2021
In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM
— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. పుష్ప మూవీ ట్రైలర్ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్బంగా పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.
My heart goes out to the people of #AndhraPradesh who have been affected by the recent floods. I am making a contribution of Rs 25 lakh towards @AndhraPradeshCM Relief Fund to aid with the rehabilitation efforts.
— Allu Arjun (@alluarjun) December 2, 2021