ప్రభాస్ 'ఆదిపురుష్' మరో వివాదంలో చిక్కుకుంది. సనాతన్ ధర్మ ప్రచారకర్త ఒకాయన ఏకంగా సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
‘ఆదిపురుష్’.. డార్లింగ్ ప్రభాస్ హీరో నటిస్తున్న మూవీ. అది కూడా పీరియాడికల్ కావడంతో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. రాముడిగా ప్రభాస్ గెటప్, డైలాగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. దీంతో టీజర్ రిలీజ్ టైంలో వచ్చిన ట్రోల్స్ అందరూ మెల్లగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఏకంగా ఓ సనాతన ధర్మ ప్రచారకర్త ఫిర్యాదు చేయడంతో ఇదికాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొచ్చేస్తే.. ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఒప్పుకొన్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం ఆధారంగా తీస్తున్న మూవీ కావడంతో చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ గతేడాది రిలీజ్ చేసిన టీజర్ చాలా ఘోరంగా ఉండేసరికి ప్రతిఒక్కరూ ట్రోల్ చేశాడు. రావణాసురుడి గెటప్, ఆ గ్రాఫిక్స్ ని అయితే అస్సలు మర్చిపోలేకపోయారు. దీంతో తప్పు సరిదిద్దుకున్న మూవీ టీమ్… వాటిని సరిచేసుకుని రీసెంట్ గా ట్రైలర్ ని విడుదల చేసింది. వచ్చే నెల మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ‘ఆదిపురుష్’ సినిమాపై సెన్సార్ బోర్డులో తాజాగా ఓ ఫిర్యాదు నమోదైంది. సనాతన్ ఘర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ.. బాంబే హైకోర్టు లాయర్ ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా ఈ కంప్లైంట్ ఇచ్చారు. థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ముందు.. స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయాలని.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ఆదిపురుష్’ టీమ్ మెంబర్స్ గతంలో ఆర్టిస్టులు, పోస్టర్ల విషయంలో చాలా తప్పులు చేశారని పేర్కొన్నారు. ఒకవేళ అవి సినిమాలోనూ ఉంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. దీనివల్ల శాంతిభద్రతల ముప్పు కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ‘ఆదిపురుష్’ చుట్టూ వివాదాలు నెలకొనడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.