Vishnu Priya: మహిళలకు బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేల ఏళ్ల నుంచి బంగారు ఆభరణాలు మహిళకు ప్రీతిపాత్రంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా బంగారం విషయంలో ఆడవాళ్ల టేస్ట్ మారలేదు. పేద వాళ్లైనా.. డబ్బున్న సంపన్నులైనా ఇందుకు అతీతం కాదు. తాజాగా, ప్రముఖ బుల్లితెర నటి విష్ణు ప్రియ తన పుట్టినరోజు గిఫ్ట్గా భారీ బంగారాన్నే పట్టేసింది. భర్త సిద్ధార్థ్ వర్మతో లక్షల విలువ చేసే బంగారాన్ని కొనించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది.
ఆ వీడియోలో ఏముందంటే.. విష్ణు ప్రియ, సిద్ధార్ద్ సోమాజిగూడలోని సీఎమ్ఆర్ జ్యూవెలరీలోకి వెళతారు. లోపలికి వెళ్లిన తర్వాత తనకు పెద్ద మొత్తంలో జ్యూవెలరీ కావాలని ఆమె అడుగుతుంది. అప్పుడు సిద్ధార్ద్ ‘ఆడాళ్లు బంగారాన్ని చూడగానే సైకో లైపోతారు’అంటూ కామెడీ చేస్తాడు. తర్వాత ఇద్దరూ జ్యూవెలరీ కలెక్షన్స్ చూశారు. 60 గ్రాముల జ్యూవెలరీ, తర్వాత మరో పెద్ద హారం, గాజులు, కమ్మలు కొన్నారు. విష్ణు ప్రియ దాదాపు 200గ్రాముల షాపింగ్ చేసింది.
సిద్ధార్ద్ దానికి సంబంధించిన బిల్లు చెల్లించి, నగల ప్యాకెట్లను భార్య చేతిలో పెట్టాడు. ఈ వీడియో మొత్తం ఫన్నీగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు విష్ణు ప్రియకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భార్యాభర్తల జంటని పొగిడేస్తున్నారు. మరి, విష్ణుప్రియకు భర్త సిద్ధార్ద్ 200 గ్రాముల బంగారు ఆభరణాలు కొనివ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anchor Ravi: ప్రియాంక సింగ్ పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ రవి!