తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎమోషనల్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తుందని అంటారు. వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలు అందుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా సమంత నటించిన ‘యశోద’ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబడుతుంది.
సమంత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. సోషల్ మీడియా వేధికగా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం తాను ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని.. అభిమానులు చూపించే ప్రేమ, ఆదరాభినాలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని తెలిపింది. సమంత నటించిన యశోద మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సమంత అమాయకంగా కనిపిస్తూనే కొన్ని యాక్షన్ సీన్లలో దుమ్మురేపింది. అయితే ఈ మూవీలో యాక్షన్ సీన్లు ఇంతబాగా రావడానికి తన ఫిట్నెస్ ట్రైనర్ అని.. జునైద్కు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా సమంత ‘నాకు ఎంతో ఇష్టమైన జిలేబీ ఎప్పుడూ జునైద్ తినడానికి ఇష్టపడలేదు..కానీ యశోద మూవీ సక్సెస్ తర్వాత యాక్షన్ సీన్లు సెలబ్రెట్ చేసుకోవడానికి స్వయంగా తనే జిలేబీ తీసుకువచ్చాడు. కొన్ని నెలలుగా నా వెన్నంటి ఉంటూ.. నా కష్టాలు, కన్నీళ్లు చూశావ్.. నాకు ప్రతిసారీ ధైర్యం చెప్పావు.. ఈ సినిమా లో ఇంత బాగా యాక్షన్ సీన్లో నటించానంటే నీ వల్లనే సాధ్యం అయ్యింది.. నీ వల్లనే నేను మారాను.. థ్యాంక్యూ’ అంటూ ఏమోషనల్ గా ట్విట్ చేసింది సమంత.