అలనాటి స్టార్ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వెళ్లవయ్యా వెళ్లు అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆడేసుకుంది. ప్రస్తుతం సదా బుల్లితెర షోలలో జడ్జిగా వస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం తెలిసిందే. సదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే తడుముకోకుండా అపరిచితుడు అని చెప్పొచ్చు. అపరిచితుడు సినిమా, హీరో విక్రమ్ గురించి సదా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సదా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అపరిచితుడు సినిమా గురించి ఆసక్తికర వ్యాక్యలు చేశారు. “అపరిచితుడు సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయేది. విక్రమ్ నాకు మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా జరిగేవి. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చేవి. అయితే సీన్ చేసిన తర్వాత విక్రమ్ నన్ను చెల్లి అని పిలిచేవారు. నేను కూడా ఆయన్ని అన్నా అనే పిలిచేదాన్ని. సీన్ చేయగానే చెల్లి అనగానే సెట్ లో అందరూ నవ్వేవాళ్లు. ఈ విషయం చివరకి డైరెక్టర్ శంకర్ గారికి కూడా తెలిసింది
విక్రమ్- నేను అన్నా చెల్లెళ్లు అని పిలుచుకుంటున్న విషయం డైరెక్టర్ శంకర్ కి తెలిసి సీరియస్ అయ్యారు. మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఇలా అన్నా చెల్లి అని పిలుచుకుంటుున్న విషయం బయట తెలిస్తే ఎలా ఉంటుంది. మిమ్మల్ని సినిమాలో స్క్రీన్ మీద చూస్తే అన్నా చెల్లి అనే భావన వారికి కలిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చేస్తే సినిమాకే నష్టం కలుగుతుంది. మొత్తానికి సినిమానే నాశనం అవుతుంది. మీరు అలా చేయకండి అని శంకర్ చెప్పారు” అంటూ నటి సదా చెప్పుకొచ్చింది.
సినిమాల విషయానికి వస్తే.. సదా ప్రస్తుతం బుల్లితెరలో షోస్ చేస్తున్నారు. జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బీబీ జోడీకి సదా న్యాయనిర్ణేతగా చేస్తున్నారు. అలాగే మళ్లీ సినిమాలు స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. నటిగా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందని చెబుతున్నారు. సపోర్టింగ్ రోల్స్, సెకండ్ లీడ్ పాత్రలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? సినిమాలు చేస్తే ఎలాంటి పాత్రల్లో కనిపించనున్నారు అనేది వేచి చూడాలి.