ప్రముఖ హీరోయిన్ వివాదంలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది! తను చేసిన ఫిర్యాదు వల్లే తానే ఇరుకున పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఆమెనే ప్రముఖ హీరోయిన్ పార్వతి నాయర్. మలయాళ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె.. ప్రస్తుతం కన్నడ, తమిళ్ లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ పార్వతి నాయర్ గురించి తెలుగులో పెద్ద తెలీదు గానీ దక్షిణాదిలోని మిగతా భాషల అభిమానులకు తెలుసు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని నుంగంబాకంలో నివాసం ఉంటోంది. గత నెలలో తన ఇంట్లో రూ.9 లక్షలు విలువ చేసే రెండు వాచీలు, రూ.లక్షన్నర విలువైన ఐఫోన్, రూ.2 లక్షలు ఖరీదు చేసే ల్యాప్ ట్యాప్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేసే సుభాష్ పై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి!
ఏ పనివాడైతే దొంగతనం చేశాడని అన్నారో.. అతడే పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై లైంగిక వేధింపులు కేసు పెడతానని ఆమె బెదిరించిందని, ఆమె ఇంట్లో చోరీ జరిగిందని చెప్పి తనని మానసికంగా వేధిస్తుందని సుభాష్ పోలీసులతో చెప్పాడు. తనని రెండుసార్లు కొట్టడమే కాకుండా ముఖంపై ఉమ్మిందని కూడా ఉన్నారు. కావాలనే తనని దొంగతనం కేసులో ఇరికించిందని సుభాష్ చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్ల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. పార్వతిని ఇంటికొచ్చి మరీ కలిశారని, అది చూసినప్పటి నుంచి తనని పార్వతి వేధిస్తోందని సుభాష్ అన్నాడు. అసలేం జరిగిందా అని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.