టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. వీరికి ఓ కుమార్తె ఉంది. మీనా భర్త, విద్యా సాగర్ అకాల మరణం పట్ల ప్రముఖ నటులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ హీరో వెంకటేశ్ ట్విట్టర్ పై స్పందిస్తూ.. ‘ఎంతో బాధాకరం… విద్యాసాగర్ మరణం షాక్ కు గురి చేసింది. మీనాకు నా హృదయ పూర్వక సంతాపం. ఈ పరిస్థితుల నుంచి వారు ధైర్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నారు.
Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼
— Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022
నటుడు శరత్ కుమార్ స్పందిస్తూ.. ‘మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’అంటూ ట్విట్ చేశారు.
It is shocking to hear the news of the untimely demise of Actor Meena’s husband Vidyasagar, our family’s heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP
— R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ స్పందిస్తూ.. ‘భయంకరమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’ అంటూ ట్విట్ చేశారు.
Waking up to a terrible news.Heartbroken to learn actor Meena’s husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭
— KhushbuSundar (@khushsundar) June 29, 2022
నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో నిద్రలేచాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు.
Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022
దేశంలో కరోనాతో ఎంతో మంది సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం కోలుకోలేకపోయారు. దీని ప్రభావం మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.