తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ, నటుల వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ప్రముఖ నటి శ్రీదేవి సోదరి కూతురు మహేశ్వరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గులాబి చిత్రం ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ‘నీ కోసం’ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక మహేశ్వరి హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోల సరసన నటించిన మహేశ్వరి.. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
మహేశ్వరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత బుల్లితెరపై మెరిశారు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తోన్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కి తాజాగా హీరోయిన్ మహేశ్వరి అతిధిగా విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ కి చుక్కలు చూపించింది నటి మహేశ్వరి. షోలో భాగంగా ఆమెను ఆహ్వానిస్తూ సుధీర్ ఆమెతో హాయ్ అంటూ చెయ్యి కలిపే ప్రయత్నం చేశాడు. ఆమె తెలివిగా నమస్కారం చేశారు మహేశ్వరి.. ‘ఇదేంటి నేను హాయ్ చెప్తే మీరు నమస్కారం పెడుతున్నారు?’ అని సుధీర్ ప్రశ్నించగా.. “వద్దు బాబూ..! నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్ ” అంటూ మహేశ్వరి పంచ్ ఇస్తూ నవ్వులు పూయించింది.
ఆ తర్వాత “మేడమ్.. నన్ను ఎక్కడ ఉండమంటారని సుధీర్ అడగగా.. నా నుంచి మాత్రం దూరంగా ఉండు చాలు” అంటూ మహేశ్వరి కౌంటర్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి.. సుడిగాలి సుధీర్ పై మహేశ్వరి ఇలాంటి పంచ్ లు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.