సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం.. దాంతో ప్రతీ ఒక్కరి చూపు సెలబ్రిటీస్ పైనే ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు అభిమానులతో పాటుగా మరికొంత మంది సన్నిహితులతో ఫొటోలు దిగుతుంటారు. అలా ఓ వ్యక్తితో ఫొటో దిగడమే ఓ స్టార్ హీరోయిన్ కు ఇబ్బందులను తెచ్చింది. ఆ ఒక్క పిక్ కారణంగానే కేసులు ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ కేసులో భాగంగానే ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టుకు తాజాగా హాజరైంది స్టార్ హీరోయిన్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
గత కొంత కాలంగా బాలీవుడ్ తో పాటు దేశంలో సంచలనం సృష్టించిన కేసు రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇక ఈ మనీలాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సంబంధాలు ఉన్నట్లు ఆమె అభియోగాలు ఎదుర్కొంటోంది. దాంతో జాక్వెలిన్ పై ఆగష్టు 17న ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంతో ఆమెకు సమన్లు సైతం జారీ చేశారు. ఈ విషయంలో మధ్యంతర బెయిల్ కోరుతూ జాక్వెలిన్ పిటీషన్ వేసింది. ట్రాయల్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
#WATCH | Actor Jacqueline Fernandez arrives at Delhi’s Patiala House Court in connection with the Rs 200 crore money laundering case involving conman Sukesh Chandrashekar.
The court will, today, hear arguments on the bail petition moved by her. pic.twitter.com/3U0FKVvwLl
— ANI (@ANI) November 10, 2022
అయితే ఫెర్నాండెజ్ దర్యాప్తులో తమకు ఎప్పుడు సహకరించలేదని ఈడీ జాక్వెలిన్ రెగ్యూలర్ బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకించింది. దాంతో తాజాగా ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టుకు జాక్వెలిన్ హాజరు అయ్యింది. కోర్టు విచారణలో సందర్భంగా పింకీ ఇరానీ సైతం న్యాయస్థానానికి హాజరైంది. అయితే ఈ విషయంపై హీరోయిన్ జాక్వెలిన్ సాక్ష్యాలు తెలిసినప్పుడే మాట్లాడతాను అంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో సుకేశ్ ను కలిసిన 10 రోజుల్లోనే అతడి గురించి ఫెర్నాండెజ్ కు తెసుసని దర్యాప్తులో తేలినట్టు ఈడీ తెలిపింది. అతడికి కచ్చితంగా సుకేశ్ తో సంబంధాలు ఉన్నాయని ఈడీ ఈ సందర్బాంగా పేర్కొంది.