‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా..’ పాటతో అప్పట్లో తెలుగు రాష్ట్ర ప్రజలందరిని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఇంద్రజ ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో వరుస సినిమాలు చేసింది. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోయిన్గా వెలుగొందారు ఇంద్రజ. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఇంద్రజ. ఒక పక్క సినిమాలతో పాటు మరో పక్క టెలివిజన్ షోలతో కూడా అలరిస్తున్నారు ఇంద్రజ. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చ్ 18న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు ఇంద్రజ.
ఇది కూడా చదవండి: తన పెళ్లి విషయంపై నటి ఇంద్రజ సంచలన నిజాలు!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలుగులో నాకు సక్సెస్ రేటు ఎక్కువ. అయితే మలయాళంలో హీరోయిన్ గా బిజీగా ఉన్నప్పుడే 2006లో వివాహం చేసుకున్నాను. అప్పుడే కొద్ది కాలం పాటు సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాను. పిల్లలకు ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాల్లో నటించకూడదని అనుకున్నాను. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు మా పాపకు 13 సంవత్సరాలు. అందుకే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు కూడా నెలలో సగం రోజులు కుటుంబంతో.. మిగతా సగం రోజులు షూటింగ్లో ఉంటున్నాను’’ అని ఇంద్రజ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇంద్రజ లాహే డ్యాన్స్ కి మెగాస్టార్ ఫిదా..!
అంతేకాక ‘‘ఈ సమాజంలో పెళ్లైన మగాడిని మగాడిగానే చూస్తారు. మహిళను మాత్రం.. పెళ్లి అయి, పిల్లలు పుట్టాక.. తల్లి అయిన తర్వాతే ఈ సమాజం గౌరవిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని అలా గౌరవించి.. చక్కటి అమ్మ, అతక పాత్రలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు అలాంటి పాత్రలు చాలా వస్తున్నాయి. రొటీన్ పాత్రలే చేస్తున్నాను అనే ముద్ర పడకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే.. వైవిధ్యంగా ఉండే పాత్రలు ఎంచుకుని.. ముందుకు సాగుతున్నాను. నటిగా నేను చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత’’ అన్నారు ఇంద్రజ. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రోజా వద్దు.. ఇంద్రజనే ముద్దు.. జబర్ధస్త్ అభిమానుల డిమాండ్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.