మా’ ఎన్నికల వ్యవహారం మరోసారి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇప్పటిదాకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగడం సినీ వర్గాల్లో పెద్ద ఇష్యూ అయింది. ఇక ఈ పోటీలో నిలిచిన వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వారు చేసే కామెంట్స్ కొత్త చర్చలకు ఊతమిస్తున్నాయి. ఈ మేరకు ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న హేమ పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ వాయిస్ మెసేజ్లో ఆమె మా’ అధ్యక్షుడు నరేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మంచు విష్ణు, ప్రకాశ్రాజ్లే ఈ ‘మా’ ఎన్నికల విషయంలో హైలెట్ అవుతూ, వారిమధ్యనే పోటీ అనేలా వాతావరణం క్రియేట్ అవుతోంది. కానీ హేమ వాయిస్ మెసేజ్ వింటే ‘మా’ ఎన్నికలు కొత్త కొత్త మలుపులు తిరగబోతున్నాయనేది అర్థమవుతోంది. ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి-నరేష్ దిగిపోవాలి అన్నట్లుగా ఈ వాయిస్ మెసేజ్లో హేమ మాట్లాడారు. మరో వైపు ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న ‘మా’ బాడీకి అన్ని అధికారాలు ఉన్నట్లేనని న్యాయ నిపుణులు చెప్పేశారు.
దీంతో ‘మా’ ఎన్నికలు ఇప్పుడప్పుడే జరగకూడదనేలా కొందరు పావులు కదుపుతున్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విష్ణు, ప్రకాష్రాజ్ల తర్వాత ‘మా’ అధ్యక్ష పదవికి బరిలోకి దిగుతున్నానని ప్రకటించింది హేమ. అంతకుముందు జరిగిన ఎన్నికలలో హేమకు 350కి పైగా ఓట్లు వచ్చాయని, వారి సపోర్ట్తోనే ఈసారి ‘అధ్యక్ష’ పదవి కోసం పోటీ చేస్తున్నానని హేమ ప్రకటించిన విషయం తెలిసిందే.