టాలీవుడ్ టు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వరుసగా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. తాజాగా, ప్రముఖ సీనియర్ నటి ఒకరు మరణించారు. వయోభార సమస్యలతో 79 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు ఎక్కువయిపోయాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా ప్రతీ పరిశ్రమలోని ప్రముఖులు మృత్యువాతపడుతున్నారు. తెలుగులో హీరో నందమూరి తారకరత్న.. తమిళంలో మాయిల్సామి.. కన్నడలో సీనియర్ దర్శకుడు ఎస్కే భగవాన్.. హిందీలో లజ్మ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. వరుస విషాదాలతో అల్లాడిపోతున్న పరిశ్రమకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా, ప్రముఖ సీనియర్ నటి బేలా బోస్ కన్నుమూశారు. వృద్ధ్యాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ 79 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. సోమవారం ఆమె చనిపోయారు.
బేలా బోస్ మృతితో భోజ్పురి, హిందీ పరిశ్రమల్లో పెను విషాదం చోటుచేసుకుంది. సినీ ప్రముఖులు బేలా మృతిపై తమ సంతాపం తెలుపుతున్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, బేలా బోస్ 1950లలో తండ్రి మరణం తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చారు. కుటుంబాన్ని పోషించటం కోసం సినిమాల్లో డ్యాన్స్లు వేసేవారు. రాజ్ కపూర్ నటించిన ‘మేన్ నషే మేన్ హూ’సినిమాతో డ్యాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1962లో నటిగా మారారు. సౌటేలా భాయ్ సినిమాలో గురు దత్కు జోడీ నటించారు.
ప్రముఖ దర్శకుడు ఆశిష్ కుమార్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ జై సంతోషీ మాత సినిమాలో కలిసి కూడా నటించారు. కేవలం డ్యాన్సర్, నటిగానే కాదు.. పద్యాలు రాసేవారు, పేయింటింగ్స్ వేసేవారు, స్విమ్మింగ్లో కూడా తన సత్తా చాటారు. ఇక, సినిమాలకు దూరం అయిన తర్వాత సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఆమెకు లక్షల సంఖ్యలో సోషల్ మీడియా ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకునేవారు. భర్త మరణం తర్వాత కొడుకు,కోడలితో కలిసి ఉంటున్నారు. మరి, బేలా బోస్ మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.