ఆమె ప్రముఖ నటి. కొత్త సిమ్ తీసుకోవడానికి ఇంటి దగ్గర్లో ఉన్న షోరూంకి వెళ్లింది. సిమ్ విషయంలో సిబ్బందితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సదరు నటిని, షోరూంలో పెట్టి సిబ్బంది లాక్ చేసేశారు. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేరళ అంతటా ఈ షాకింగ్ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళ సినీ పరిశ్రమలో ఈ మధ్య కొన్ని షాకింగ్ వార్తలు బయటకొస్తున్నాయి. అవికాస్త చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఓ యువహీరో అసభ్య ప్రవర్తన కారణంగా, యూట్యూబ్ యాంకర్ పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మరవక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నటి అన్నా రాజన్.. గురువారం సాయంత్రం కొత్త సిమ్ తీసుకోవడానికి అలువా మున్సిపల్ ఆఫీస్ దగ్గర్లోని ఓ టెలికాం షోరూంకి వెళ్లింది. అయితే సిమ్ తీసుకునే విషయంలో సిబ్బందితో గొడవ జరిగింది. దీంతో అన్నా, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నటిగా కాకుండా ఓ సాధారణ మహిళగా తను సిమ్ తీసుకోవడానికి వెళ్లానని అన్నా చెప్పింది. అయితే సిమ్ కోసం ఐడీ కార్డు ఇచ్చే విషయంలో గొడవ జరిగిందని ఈమె చెప్పింది. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి తనతో చెడుగా మాట్లాడటంతో ఆమె ఫొటో తీశానని, దీంతో వారు దాన్ని డిలీట్ చేయమని చెప్పడం కోసం షటర్ దించి లాక్ చేశారని అన్నా పేర్కొంది. ఈ గొడవ జరిగే క్రమంలో వాళ్లు, తన చేయి పట్టుకుని లాగడంతో అది కాస్త మేకుకు తగిలి గాయమైందని అన్నా చెప్పింది. ఇక కాసేపటికి అమ్మాయి సారీ చెప్పడంతో ఆమెని క్షమించేసినట్లు పేర్కొంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రాత్రికి రాత్రే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావడం విశేషం! మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.