టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్.. అమలాపాల్. ‘బెజవాడ’ సినిమాతో తెలుగు తెరకు పరియమైంది అమల. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో.. మొదలైన చిత్రాల్లో నటించింది. అతి తక్కువ సమయంలో వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ కల్చర్ పై ఈ అమ్మడు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలో కేవలం కొన్ని విషయాల కోసమే హీరోయిన్లను ఎంచుకుంటారంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
17ఏళ్ల వయసులో ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసింది. అనంతరం 2010లో తమిళ సినిమా మైనాతో సూపర్ హిట్ అందుకుంది. నాగచైతన్య హీరోగా నటించిన బెజవాడ సినిమాతో 2011లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. అలా 2015 వరకు అనేక సినిమాలతో తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే అనంతరం కొంతకాలం తెలుగు సినిమలో అరుదుగా కనిపిస్తూ వచ్చింది.2021లో ‘పిట్టకథ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల.. టాలీవుడ్ కల్చర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినిమాల్లో కేవలం లవ్ సీన్స్, సాంగ్స్ కోసమే హీరోయిన్లను ఎంచుకుంటారని అభిప్రాయపడింది.
టాలీవుడ్ లో తన ఎక్స్పీరియన్స్ ను ఈ అమ్మడు షేర్ చేసుకుంది. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ కాన్సెఫ్ట్ ఉంటుందని ఇక్కడి వచ్చిన మొదటి రోజే అర్ధమైందని, అలాంటి సినిమాలనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని తను గుర్తించినట్లు తెలిపింది. ఇలాంటి భిన్నమైన సంప్రదాయం కారణంగా పరిశ్రమకు పెద్దగా తాను కనెక్ట్ కాలేకపోయానని, అందుకే తెలుగులో తక్కువ సినిమాలు చేసినట్లు వెల్లడించింది. ఇక తమిళలో తాను నటించిన మొదటి చిత్రం మైనా బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, ఆ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరినట్లు ఈ భామ తెలిపింది. పెళ్లి , విడాకుల తరువాత అమలా తన రూట్ పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో ఈ అమ్మడు బిజిగా ఉన్నారు. మరి.. టాలీవుడ్ పై అమలా పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.