స్త్రీలను దేవతలుగా పూజించే భారతదేశంలో.. రోజూ ఏదో ఒక ప్రాంతలో వారిమీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ మహిళలపైనే కాకుండా సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార హీరోయిన్ ల వరకు చాలా మంది మేము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటారు. ఇక ఇండస్ట్రీకి రాకముందు సైతం కొంతమంది తారలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే చిన్నతనంలో తాను కూడా లైంగికంగా వేధింపులకు బాధితురాలినే అంటూ స్టార్ హీరోయిన్ సంచలన విషయాలను బయటపెట్టింది. గుడికి వెళ్లినప్పుడు ఓ యువకుడు తన ప్రైవేట్ పార్ట్స్ తాకినట్లు ఆమె వెల్లడించింది.
సాధారణంగా హీరోయిన్ లు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని చెబుతుంటారు. అయితే కొంత మంది హీరోయిన్ లు మాత్రం తాము పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే లైంగికంగా వేధింపులకు గురయ్యామని చెబుతుంటారు. తాజాగా అలాంటి వేధింపులకే తన జీవితంలో కూడా జరిగాయని చెప్పుకొచ్చింది మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరెక్కించిన పొన్నియిన్ సెల్వన్, అమ్ము చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య నటించిన మట్టి కుస్తి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో జరిగిన మర్చిపోలేని సంఘటన గురించి చెప్పుకొచ్చింది.
ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..”నేను చిన్నగా ఉన్నప్పుడు ఓ రోజు కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్లాం. అప్పుడు ఓ యువకుడు గుడిలోనే నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు. అదీకాక చాలా దురుసుగా ప్రవర్తించాడు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఆ రోజు జరిగిన ఆ సంఘటనను ఈ రోజు వరకు కూడా మర్చిపోలేక పోతున్నాను. ఇక ఆ సమయంలో నేను పసుపు కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు నాకు పసుపు కలర్ డ్రెస్సులు వేసుకోవాలి అంటేనే చాలా భయం. ఇప్పుడ ఆ భయం లేదు” అంటూ తన జీవితంలో జరిగిన భయంకర సంఘటనను వెల్లడించింది ఐశ్వర్య లక్ష్మి. ప్రస్తుతం ఈమె నటించిన మట్టి కుస్తీ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.