అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం F3. మే 27న థియేటర్లలో విడుదలయ్యి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ సక్సెస్ మీట్ లో ఓ సంఘటన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అదేంటంటే.. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ మీట్ హోస్ట్ మంజూషపై సీరియస్ అయ్యారు. ఆగవమ్మా నీ గోల అంటూ అనగానే యాంకర్ మంజూష చిన్నబుచ్చుకుని స్టేజ్ దిగేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు ఏం జరిగిందంటే.. F3 సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా సూపర్ హిట్ కాకపోతే నేను ముందు నిలబడను అని వ్యాఖ్యానించారు. సక్సెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ కర్చీఫ్ కట్టుకుని కూర్చుకున్నారు. ఆయన స్టేజ్ మీదకు వచ్చే ముందే ఓ ఏవీ ప్లే చేశారు. అందులో గతంలో F3 సినిమా గురిచిం రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ను చూపించారు.
ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మైక్ తీసుకోని మాట్లాడబోతుండగా.. యాంకర్ సార్ మాస్క్ తీయొచ్చుగా అనబోతుంది. అంతలోనే రాజేంద్ర ప్రసాద్ ‘ఉండవమ్మ నీ గోల.. ఇక్కడ మా గోలే సరిపోదంటే నీ గోల ఓకటి మాట్లాడనీయవా’ అంటూ చిరాకు పడటంతో సరే అంటూ యాంకర్ మంజూష ముఖం చిన్నబుచ్చుకుని స్టేజ్ దిగేసింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ముఖానికున్న మాస్క్ తీసి సినిమా గురించి, ఆయన కెరీర్ గురించి మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.