ప్రముఖ నటుడు నాజర్ సౌత్ ఇండస్ట్రీ లోని అన్ని భాషల్లో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కామెడీ, విలన్, సహయ నటుడిగా నటించిన మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో నాజర్ మాట్లాడుతూ.. తనకు మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. తాము ఇద్దరం ఒకే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందామని అన్నారు. వివరాల్లోకి వెళితే..
కెరీర్ బిగినింగ్ లో తాము ఇద్దరం ఒకే యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందినట్లు తెలిపారు. అంతే కాదు ఆ సమయంలో చిరంజీవి గొప్ప నటుడు అవుతాడని ఆనాడే చెప్పాను అన్నారు. తాను ఉండేది చెంగల్పట్టు లో.. ఇనిస్టిట్యూట్ కి రావాలంటే దాదాపు అరవై కిలోమీటర్లు ట్రైన్ లో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఆ సమయంలో నేను ఉదయం లేచి ఆరు గంటలకే బయలు దేరేవాడినని.. అందుకోసం అన్నం ఒక్కటే టిఫిన్ లో పెట్టుకొని వెళ్లేవాడినని అన్నారు.
ఒకరోజు తాను కేవలం అన్నం మాత్రమే తీసుకు వచ్చానని తెలుసుకున్న చిరంజీవి వెంటనే తన వద్దకు వచ్చి కోప్పడ్డాడని… ఉదయమే వంట చేయమని అమ్మను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్.. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని. ఆ రోజు నుంచి తమతో కలిసి భోజనం చేయాల్సిందిగా పట్టుబట్టాడని నాజర్ అన్నారు. అయితే చిరంజీవి, ఇతర స్నేహితులు ఆంధ్ర మెస్ నుంచి భోజనాలు తెచ్చుకునేవారని చెప్పారు. ఆ రోజు వారు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదని అన్నారు.
చిరంజీవి ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి.. ఎదుటి వారు కష్టపడితే అస్సలు చూడలేడని అన్నారు. అందుకే ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు.. గొప్ప వ్యక్తిగా ఎదిగారని అన్నారు. యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, తనకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదని… దీంతో, ఒక హోటల్ లో వెయిటర్ పని చేశానని చెప్పారు. కొన్నాళ్లకు ప్రముఖ దర్శకులు బాలచందర్ ఓ సినిమాలో అవకాశం ఇచ్చారని నాజర్ చెప్పారు. ఆ తర్వాత తాను, తన మిత్రుడు చిరంజీవి కలిసి ఎన్నో చిత్రాల్లో నటించామని తెలిపారు. ఇప్పటికీ తమ ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోందని చెప్పారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.