Raj Tarun: షార్ట్ ఫిల్మ్లతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ ఫిల్మ్లో హీరో స్థాయికి ఎదిగారు రాజ్ తరుణ్. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరపై హీరోగా పరిచయమ్యారు. మొదటి సినిమాకే సైమా అవార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్లను సాధించారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటనతో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. లాక్డౌన్ సమయంలో అందరూ సెలెబ్రిటీలలాగే రాజ్ తరుణ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారంట. ఒంటరిగా ఇంట్లో ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారంట.
ఈ విషయాలను రాజ్ తరుణ్ స్నేహితుడు, నటుడు మధు నందన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ రాజ్ తరుణ్ మా ఫ్యామిలీలాగా. కరోనా ఫస్ట్లాక్ డౌన్ టైంలో 15 రోజులు గడిచాయి. మరో 15 రోజులు లాక్డౌన్ పెరిగింది. అది తర్వాత 30 రోజులు అయింది. లాక్డౌన్కు ఒక రోజు ముందు రాజ్ తరుణ్ వాళ్ల ఫ్యామిలీ గోవా వెళ్లింది. 2 నెలలు గడిచాయి. వాళ్ల ఫ్యామిలీ అక్కడే ఉండిపోయింది. ఇంట్లో రాజ్ ఒక్కడే ఉన్నాడు. రాజ్కు ఫోన్ చేశాను.
‘డార్లింగ్ ఇంకో వన్ వీక్ అయితే సూసైడ్ చేసుకుంటా. అలా ఉంది నా పరిస్థితి.. ఒక్కడ్నే ఉంటున్నా..’ కామెడీగా మాట్లాడుతూ అన్నాడు. ‘నా వల్ల కాదు.. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వన్న ఇటురా నన్ను అన్నా మీ ఇంటికి తీసుకెళ్లు’ అని అన్నాడు. మా ఫ్రెండ్ దగ్గర ఎసెన్షియల్ సర్వీసెస్ పాస్ ఉంది. అతడ్ని రిక్వెస్ట్ చేశాను. అతడు రాజ్ తరుణ్ని ఇంటికి తీసుకువచ్చాడు. అలా త్రీ వీక్స్ మా ఇంట్లో ఉన్నాడు. వాళ్ల పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇంటికి పంపించేశాను’’ అని తెలిపాడు. మరి, మధునందన్ చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Virata Parvam: విరాటపర్వంలో సాయి పల్లవి క్యారెక్టర్ నిజ జీవితంలో ఈమెదే..!