ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు అకస్మాత్తుగా కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంటుంది. వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు లోహితస్వి ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో కన్నుమూశారు. లోహితస్వి ప్రసాద్ కన్నడ ఇండస్ట్రీలో 500 లకు పైగా చిత్రాల్లో నటించారు. దానితో పాటు కొన్ని సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.
సినీ ఇండస్ట్రీకి రాకముందు ఆయన ఓ కాలేజ్ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేశారు. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీవైపు వచ్చారు. కన్నడనాట పలు హిట్ చిత్రాల్లో నటించిన లోహితస్వి ప్రసాద్ బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. ఆయన నటించి సీరియల్స్ కి బాగా ప్రజాదరణ వచ్చింది. ఆయన తనయుడు శరత్ లోహితస్వ సైతం ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అఖండ, సాహూ, అరవింద సమేత లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.