తెలుగు సినీ పరిశ్రమ కేవలం ఇక్కడ నటులనే కాకుండా.. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లకు ఆఫర్లు ఇచ్చి ప్రోత్సహించింది. కేవలం హీరో హీరోయిన్లకే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలో పేరు గాంచిన కమెడియన్లు, విలన్లకు అవకాశాలు ఇచ్చింది. అటువంటి వారిలో ఒకరే ఈ నటుడు. ఇటీవల ఆయనను సమన్ టీవీ పలకరించింది.
సినీరంగ పరిశ్రమలో టాలెంటెడ్ నటీనటులకు కొదవ లేదు. టాలీవుడ్లో నాటి తరం నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ల నుండి నేటి తరం నటుల వరకు తమను తాము నిరూపించుకున్నవారే. అయితే తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి, ఆ తర్వాత విలనిజం పండించి.. ఆపై హీరోలుగా మారిన వారున్నారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ వీరంతా ఆ కోవకు వర్తిస్తారు. అలాగే కన్నడ పరిశ్రమలో కూడా అటువంటి ఓ నటుడు ఉన్నారు. ఆయనే దేవరాజ్. పేరు చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. తెలుగులో పలు సినిమాల్లో విలన్గా పేరు తెచ్చుకున్నారు. ఎర్రమందారంలో జగ్గన్నదొరగా, యజ్ఖంలో హీరోయిన్ తండ్రిగా మెప్పించిన నటుడే దేవ రాజ్.
దేవరాజ్ తెలుగు, కన్నడ, తమిళ పరిశ్రమల్లో సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించారు. కర్ణాటక బెంగళూరుకు చెందిన ఆయన..థియేటర్ ఆర్టిస్టు కూడా. తొలుత కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమా విడుదల కాకపోయినా, రెండో సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోను సుమన్ టీవీ పలకరించింది. ఆయనను పలకరిస్తూ.. హోం టూర్ చేసింది. అంతేకాకుండా అవార్డులు, ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన ఇల్లు చూస్తే కోటను తలపిస్తుంటోంది. ఇంట్లోకి వెళ్లగానే.. అవార్డులు, పెయింటిగ్స్, ఫ్యామిలీ ఫోటోస్ కనిపిస్తున్నాయి. ఆయన నటి చంద్రలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.
1987 నుండి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. తానెప్పుడూ సినిమా స్టార్ అవుతాడని అనుకోలేదని అన్నారాయన. తాను థియేటర్ ఆర్టిస్టునని, స్నేహితులు పిలిస్తే సినిమాల్లోకి వెళ్లినట్లు చెప్పారు. కాగా, దేవరాజ్ తెలుగులో భారత నారి, 20వ శతాబ్దం, ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, అన్న, ఎస్.పి. పరుశురాం, సమరసింహా రెడ్డి, లక్ష్యం, భరత్ అనే నేను సినిమాలో నటించారు. అలాగే కన్నడలో కూడా అనేక సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఆయన పెద్ద కుమారుడు ప్రజ్వాల్ దేవ్ రాజ్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.