దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన బాధితుల సంఖ్య మొత్తం 41కి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. కరోనా ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ కలకలం సృష్టిస్తుంది. ఇటీవలే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి బయటపడ్డారు. బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, అమృతా అరోరాలకు కరోనా పాజిటివ్ కరోనా సోకింది. కరీనాతో టచ్ లో ఉన్నవాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, సన్నిహితంగా ఉన్నవారు క్వారంటైన్ అవ్వాలని అధికారులు సూచించారు.
తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయిన్చుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నీ అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘కోవిడ్ 19 టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ట్రీట్ మెంట్ తీసుకుని ఐసోలేషన్కి వెళ్లాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు, నా దగ్గరి వాళ్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బావుంది. జాగ్రత్తగా ఉండండి.. మాస్కుల ధరించడం మరచిపోకండి.. రామ భక్తహనుమాన్ కి జై’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు.
హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాతగా కూడా మారారు. అలాగే దర్శకుడిగా మారి జైహింద్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కూడా వైవిధ్యమైన పాత్రలను చేస్తున్నారు.
ఇదీ చదవండి : అతడే విన్నర్ అంటూ యాంకర్ రవి ప్రచారం..