గతకొన్ని నెలలుగా మాంద్యం దెబ్బకు ఐటీ కంపెనీలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగానే కాక దేశంలోనూ ఐటీ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో కాస్ట్ కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులనే తొలగించాలని చూస్తున్న కంపెనీలు కొన్నైతే.. ఇప్పటికే ఉద్యోగులను ఇళ్లకు పంపించిన కంపెనీలు మరికొన్ని. ఇలాంటి సమయంలో ఐటీ దిగ్గజం విప్రో, ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త చెప్పింది. రాబోవు రెండు.. మూడు నెలల్లో క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా భారీగా నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాబోవు మూడు నెలల్లో క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా దాదాపు 8000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. మరిన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్ https://careers.wipro.com/careers-home/లో చూడవచ్చు. ఓపెనింగ్స్ ను బట్టి అర్హతల ఆధారంగా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. కంపెనీలు వరుస పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్న ఈరోజుల్లో ఇది కొంచెం ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. కాగా, ఇటీవల విప్రో తన మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో త్రైమాసికంలో రూ.30.5 బిలియన్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే కంపెనీ ఆదాయం రూ.232.3 బిలియన్లకు పెరిగింది. కస్టమర్లతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అందుకే మంచి వృద్ధిని సాధించగలిగినట్లు విప్రో వెల్లడించింది.
Ready to upgrade your diploma to a sponsored BTech degree while working? @Wipro SIM Program is now open! If you are a 2021, 2022 or 2023 diploma holder in Computer Science, IT, EC, Electrical and Electronics or Telecommunication, apply today: https://t.co/jKo8yalMqy pic.twitter.com/SK7zFkE7oM
— Careers @ Wipro (@WiproCareers) November 17, 2022