ఇంటర్ పాసయ్యారా? ప్రభుత్వం ఉద్యోమీ మీ లక్ష్యమా..? అయితే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కేవలం ఇంటర్ అర్హత. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.
ఉద్యోగుల భవిష్య నిధి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం185 స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 185
విభాగాలు: స్టెనోగ్రాఫర్ (గ్రూప్ – సి)
కేటగిరీ వారీగా ఖాళీలు:
అర్హతలు: ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుండి15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3 నుండి 8 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.25,500 – రూ.81,100 మధ్య ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. 200 ప్రశ్నలకుగాను 800 మార్కులు కేటాయించారు. జనరల్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్& కంప్యూటర్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 130 నిమిషాలు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.700 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్- సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష సెంటర్లు: హైదరాబాద్/సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభతేది: 27.03.2023
దరఖాస్తులకు చివరితేది: 26.04.2023