ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో 9360 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 9212 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, దానికి ఇప్పుడు 148 పోస్టులు అదనంగా యాడ్ చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 9360కి చేరింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మహిళలు కూడా అర్హులే. దరఖాస్తు చేయు విధానం, ఎంపిక ప్రక్రియ, జీతభత్యాలు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 9212+148
విభాగాల వారీగా ఖాళీలు:
పురుషులు: మోటార్ మెకానిక్ – 544, డ్రైవర్ – 2372, కాబ్లర్ – 151, కార్పెంటర్ – 139, టైలర్ – 242, బ్రాస్ బ్యాండ్ – 172, పైప్ బ్రాండ్ – 151, బగ్లర్- 1340, గార్డెనర్ – 92, పెయింటర్ – 56, కుక్/ వాటర్ క్యారియర్ – 2429, వాషర్ మన్ – 403, బార్బర్ – 303, సఫాయి కర్మచారి – 811.
మహిళలు: బ్రాస్ బ్యాండ్ – 24, బగ్లర్ – 20, కుక్/ వాటర్ క్యాషియర్ – 46, వాషర్ ఉమెన్ – 3, హెయిర్ డ్రస్సర్ – 1, సఫాయి కర్మచారి – 13, డ్రాఫ్టి – 80, ప్యూన్ – 52, ఫరాష్ – 7, మినిస్టిరియల్ – 9.
విద్యార్హతలు: పోస్టులను బట్టి విద్యార్హతలు వేరు వేరుగా ఉన్నాయి. పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.
వయోపరిమితి: పోస్టులను బట్టి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎక్సామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 2 గంటలు. జనరల్ ఇంటెలిజెన్స్/రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో 25 ప్రశ్నలు, ఇంగ్లిష్/హిందీ నుంచి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్,ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, వరంగల్ (అర్బన్).
దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 27, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2023 (పొడిగించబడింది).