డబ్బు కోసం దేశాన్ని మోసం చేశాడా? రషీద్ ఖాన్​పై విమర్శలు!

అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్​పై క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. అతడు తన దేశాన్ని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 02:15 PM IST

క్రికెట్​లో ప్రపంచ వ్యాప్తంగా లీగ్​ల సందడి ఎక్కువైంది. జెంటిల్మన్ గేమ్ ఆడే బడా దేశాలు అన్నింట్లోనూ టీ20 లీగ్​లు మొదలయ్యాయి. బిగ్​బాష్ లీగ్​ నుంచి బంగ్లా ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ వరకు ఎన్నో లీగ్​లు ఆడియెన్స్​కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని లీగ్​లు మొదలవుతాయని సమాచారం. అసలు ఈ లీగ్స్ అన్నింటికీ మూల కారణం భారత్​లో నిర్వహించే ఐపీఎల్​ అని చెప్పొచ్చు. టెస్టు క్రికెట్ క్రమంగా ప్రాభవం కోల్పోతున్న వేళ, వన్డే క్రికెట్​ కంటే టీ20 ఫార్మాట్​కు మంచి ఫ్యూచర్ ఉంటుందని గుర్తించింది బీసీసీఐ. అనుకున్నదే తడవుగా ఐపీఎల్​కు శ్రీకారం చుట్టింది. ఇప్పటిదాకా ఐపీఎల్​ సూపర్ సక్సెస్ అవుతూ వచ్చింది. అయితే ఈ లీగ్స్ వల్ల ఆటగాళ్లపై చాలా విమర్శలు వస్తున్నాయి.

లీగ్స్​లో ఆడే ప్లేయర్లపై రూ.కోట్ల వర్షం కురుస్తోంది. ఆటగాళ్లకు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడటం లేదు. దీంతో లీగ్​లో ఆడేందుకు క్రికెటర్లు సై అంటున్నారు. కావాలంటే తమ జాతీయ జట్లు ఆడే టోర్నీలకు డుమ్మా కొట్టేందుకూ వెనుకాడటం లేదు. లీగ్స్​లో ఆడితే వచ్చే డబ్బులతో పోలిస్తే.. జాతీయ జట్లకు ఆడితే వచ్చే శాలరీ చాలా తక్కువ. దీంతో గాయాలైనా సరే, లీగ్​లు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటున్నారు. ఈ ఎఫెక్ట్ ఆయా ప్లేయర్ల నేషనల్ టీమ్స్​పై పడుతోంది. కీలక ఆటగాళ్లు ముఖ్యమైన సిరీస్​లకు ఇంజ్యురీలతో దూరం కావడంతో జట్టు విజయావకాశాలపై దెబ్బ పడుతోంది. ఇప్పుడు ఒక ఆటగాడి వల్ల అఫ్గానిస్థాన్ పరిస్థితి అలాగే ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ ఐపీఎల్​-2023లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అటు బాల్​తో పాటు ఇటు బ్యాట్​తోనూ రాణించాడు రషీద్.

ఐపీఎల్​ పదహారో సీజన్​లో 27 వికెట్లు తీసిన రషీద్.. టాప్ బౌలర్ల జాబితాలో రెండో ప్లేసులో నిలిచాడు. కాగా, రషీద్​ ఖాన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. లోవర్ బ్యాక్ పెయిన్​తో ఇబ్బంది పడుతున్న ఈ అఫ్గాన్ ఆల్​రౌండర్​.. శ్రీలంకతో ఆడబోయే వన్డే సిరీస్​లో తొలి రెండు మ్యాచ్​లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్​లో రషీద్ గాయంతోనే ఆడాడని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గాయం ఉందని ముందే తెలిసినప్పుడు ఐపీఎల్​ నుంచి బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవాల్సిందని అంటున్నారు. కానీ రషీద్ మాత్రం దేశం కంటే ఐపీఎల్​కే ప్రాధాన్యత ఇచ్చాడని.. అతడికి డబ్బులే ముఖ్యమని తిట్టిపోస్తున్నారు. రషీద్ తన దేశాన్ని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. మరి.. రషీద్ ఖాన్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed