IPL 2023 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? ఫొటో వెనక అసలు కథ!

ఐపీఎల్​-2023 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫొటోను చూస్తే ఇది నిజమని అనక మానరు. అయితే ఆ ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 04:09 PM IST

ఐపీఎల్ పదహారో సీజన్ క్లైమాక్స్​కు చేరుకుంది. ఈ ట్రోఫీ ఫైనల్​కు చేరుకున్న రెండు జట్లూ హేమాహేమీలనే చెప్పాలి. అందులో ఒక టీమ్ అయిన గుజరాత్ టైటాన్స్.. ఫస్ట్ మ్యాచ్​ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఎదురొచ్చిన ప్రతి టీమ్​ను ఓడిస్తూ టోర్నీలో ముందుకు సాగింది. గెలుపు పరంపరను కొనసాగిస్తూ లీగ్ స్టేజీ ముగిసే టైమ్​కు పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేసులో నిలిచింది. అయితే ప్లేఆఫ్స్​లోనే గుజరాత్​కు అసలు టెన్షన్ మొదలైంది. క్వాలిఫయర్స్​-1లో సీఎస్​కే చేతిలో ఓటమితో ఆ జట్టు కుంగిపోయింది. అయితే ఫైనల్​కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన క్వాలిఫయర్​-2లో మాత్రం గుజరాత్ అద్భుతం చేసింది. ముంబై ఇండియన్స్​పై విక్టరీతో ఆ టీమ్ ఫైనల్​కు క్వాలిఫై అయింది. ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఒంటిచేత్తో గుజరాత్​ను ఫైనల్​కు చేర్చాడు.

శుబ్​మన్ గిల్ క్లాస్ హిట్టింగ్​కు ప్రత్యర్థులు దాసోహమన్నారు. మరోవైపు చెన్నై కథ మాత్రం వేరేలా ఉంది. సీజన్​ ఫస్టాఫ్​లో వరుస ఓటములతో డీలాపడింది చెన్నై. ఒక దశలో ట్రోఫీ సంగతి పక్కనబెడితే కనీసం ప్లేఆఫ్స్​కు సీఎస్​కే చేరుకున్నా గ్రేట్ అనేలా కనిపించింది. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోని తన అనుభవాన్ని రంగరించి టీమ్​ను విజయాల బాట పట్టించాడు. అవసరం, సందర్భాన్ని బట్టి అందుబాటులో ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ వనరులను సరిగ్గా వాడుకొని టీమ్​కు ఎదురు లేకుండా చేశాడు. దీంతో చెన్నై ప్లేఆఫ్స్​కు చేరుకుంది. ఇక పటిష్టమైన గుజరాత్​ను క్వాలిఫయర్స్​లో మట్టికరిపించి.. తుదిపోరులోనూ అదే జట్టును ఢీకొనేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మ్యాచ్ జరగకుండానే విన్నర్ ఎవరో తేలిపోయిందని నెటిజన్స్ అంటున్నారు. గుజరాత్ టైటాన్సే ఈ సారి కప్ గెలవబోతోందని చెబుతున్నారు. దీనికి కారణం.. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి ఐపీఎల్​ ఫైనల్​ ఫైట్ జరగాల్సింది. అయితే వర్షం వల్ల మ్యాచ్​ను రిజర్వ్ డేకు మార్చారు. మ్యాచ్​కు ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో స్క్రీన్ టెస్టులో భాగంగా చెన్నై రన్నరప్ అని ప్లే చేశారు. ఆ ఫొటోలే ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో అందరూ మ్యాచ్ ఫిక్స్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి స్టేడియం సిబ్బంది స్క్రీన్ టెస్టులో భాగంగా చేసిన పొరపాటుగా దీన్ని చెప్పొచ్చు. అయితే చెన్నై రన్నరప్ అనే ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed