ప్రస్తుత తరం క్రికెట్ లో అగ్రెస్సివ్ గా ఎవరుంటారు అంటే వెంటనే కింగ్ విరాట్ కోహ్లీ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం చాలా కష్టం తో కూడుకున్నది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డుప్లెసిస్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ప్రస్తుత తరం క్రికెట్ లో అగ్రెస్సివ్ గా ఎవరుంటారు అంటే వెంటనే కింగ్ విరాట్ కోహ్లీ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ప్రత్యర్థి జట్టులో 11 నెంబర్ ఆటగాడు ఔటైనా.. కోహ్లీ సెలెబ్రేషన్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయం చాలు కోహ్లీకి ఆట మీద ఎంత అంకిత భావమో చెప్పడానికి. తన మీదకు వస్తే మాటకు మాటే ఆటకు అన్నట్లుగా విరాట్ దూకుడు ఉంటుంది. ఈ ఆటిట్యూడ్ కారణంగానే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కోహ్లీకి ప్రత్యర్థిగా ఉండడం చాలా కష్టం తో కూడుకున్నది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డుప్లెసిస్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అనుబంధం మనకు తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఓపెనింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా.. డుప్లెసిస్ కోహ్లీ గురించి మాట్లాడుతూ..”విరాట్ గురించి చెప్పాలంటే అతని ప్యాషన్ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. విరాట్ ప్రత్యర్థిగా ఆడిన క్షణాలు కూడా ఎప్పటికీ మరవను. వికెట్ పడిన ప్రతీసారీ అతని ఉత్సాహం ఎలా ఉంటుందో తెలుసు కదా. 11వ నంబర్ బ్యాటర్ ఔటైనా విరాట్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటాడు. అతడు ఆట పట్ల ఎప్పుడూ ఇంత మక్కువగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు అతనితో కలిసి ఒకే టీమ్ లో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను.. విరాట్ కు ప్రత్యర్థిగా ఉండటం కంటే అతనితో కలిసి ఆడటం చాలా బాగుంటుంది” అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఇక డుప్లెసిస్ సారధ్యం వహిస్తున్న ఆర్సీబీ జట్టు నేడు సన్ రైజర్స్ తో కీలక మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. కాసేపట్లో హైదరాబాద్ లో జరగనున్న ఈ మ్యాచులో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ప్రస్తుతం 12 మ్యాచులాడిన ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చివరి రెండు మ్యాచులు గెలిస్తేనే ప్లే ఆఫ్ కి వెళ్తుంది. మరి విరాట్ కోహ్లీ మీద డుప్లెసిస్ కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.