ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినేలా ఉన్నారు. ఎందుకంటే కెప్టెన్ ధోనీ గాయమైందనే న్యూస్ వైరల్ గా మారింది. మహీ ఫ్యాన్స్ ఆందోళనకు కూడా ఈ న్యూస్ కారణమైంది.
చెన్నైసూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. రెండు రోజుల్లో ఐపీఎల్ మొదలయిపోతుంది. సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ చూడబోతున్నాం అని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. సరిగా ఇలాంటి సమయంలో ఓ బ్యాడ్ న్యూస్ సదరు అభిమానుల్ని కలవరపెడుతోంది. ఇది నిజం కాకూడదు అని గట్టిగా కోరుకుంటున్నారు. మరోవైపు ఇది అంత పెద్ద సమస్య అయ్యుండదులే అని మాట్లాడుకుంటున్నారు. మొన్ననే ప్రాక్టీసులో ఫుల్ ఎనర్జీతో కనిపించాడు ఇంతలోనే ఏమైంది అని క్రికెట్ ప్రేమికులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? ధోనీకి ఏమైంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2020లో రిటైర్ అయిపోయాడు. అప్పటినుంచి ప్రతి ఏడాది ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న మహీ.. గతేడాది జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేశాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ తానే ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక ఈ సీజన్ లో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే రీసెంట్ గా చెపాక్ లో సిక్సులు, ఫోర్లు కొడుతూ ప్రాక్టీస్ చేశాడు. అయితే గ్రౌండ్ లోకి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ధోనీ కాస్త కుంటుతున్నట్లు కొందరు ఫ్యాన్స్ గమనించారు. ఈ క్రమంలోనే గాయమైందనే న్యూస్ బయటకొచ్చింది.
ప్రాక్టీసు సందర్భంగా ధోనీ ఎడమ మోకాలు కాస్త పట్టేసిందని తెలుస్తోంది. దీంతో మోకాలికి క్యాప్ పెట్టుకుని ప్రాక్టీసు కోసం వచ్చాడు. అయితే ఇదేమంత పెద్ద గాయం కాదని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే తొలి మ్యాచుకు అంతా సెట్ అయిపోతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత సీజన్ లో ఎంట్రీ గుజరాత్ జట్టు.. ఏకంగా కప్ కొట్టి విజేతగా నిలిచింది. చెన్నైతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గుజరాత్ విజయం సాధించింది. ఇప్పుడు తొలి మ్యాచులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తుంది. ఇలాంటి టైంలో ధోనీ పరిస్థితి కాస్త కంగారు పెడుతున్నట్లు కనిపిస్తుంది. మరి మీలో ఎంతమంది చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ చేయండి.
The king is back. ❤️ #Dhoni. pic.twitter.com/mX9Qby6tYC
— Prayag (@theprayagtiwari) March 27, 2023