మ్యాచ్ సందర్భంగా మైదానంలో కోహ్లీ-గంభీర్ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. దీంతో బీసీసీఐ ఫుల్ సీరియస్ అయింది. వీళ్లిద్దరి తిక్క కుదిర్చింది.
సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ అనగానే రెండు జట్లు ఆడతాయి. గెలిచిన టీమ్ సెలబ్రేట్ చేసుకుంటుంది. తర్వాత ఎవరికీ వాళ్లు నెక్స్ట్ మ్యాచ్ ఆలోచన పడిపోతారు. దాదాపుగా ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ తాజాగా ఆర్సీబీ-లక్నో మ్యాచ్ లో పెద్ద విధ్వంసమే జరిగింది. మ్యాచ్ అంతా ఓ ఎత్తయితే.. అంతా అయిపోయిన తర్వాత కోహ్లీ-గంభీర్ మధ్య జరిగిన సంఘటన వాళ్లకు ఎలా ఉందో తెలియదు గానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మజాని ఇచ్చింది. మొత్తం సోషల్ మీడియా అంతా దీని గురించే టాపిక్ నడుస్తోంది. వీళ్లిద్దరి తిక్క ఇప్పుడు బీసీసీఐ కుదిర్చింది కూడా. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొస్తే.. ఏ స్పోర్ట్స్ అయినా సరే గెలవడం, ఓడిపోవడం చాలా కామన్. అయితే కొన్నిసార్లు గెలిచిన జట్టు ఆటగాళ్లు అతి చేస్తుంటారు. కొన్నిరోజుల ముందు ఆర్సీబీతో మ్యాచ్ గెలిచిన తర్వాత లక్నో క్రికెటర్లతోపాటు మెంటార్ గంభీర్ ఇలానే కాస్త అతి చేశాడు! అది అలానే మనసులో పెట్టుకున్న ఆర్సీబీ ప్లేయర్ కోహ్లీ.. తాజాగా అదే జట్టుపై వాళ్ల సొంత మైదానంలో గెలిచాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు నవీన్ హుల్ హక్ తో, అయిపోయిన తర్వాత గంభీర్ తో కోహ్లీ గొడవపడ్డాడు.
ఇలా మ్యాచ్ సందర్భంగా గొడవ పడటం ఐపీఎల్ లో సరైన పద్ధతి కాదు. అందుకే కోడ్ ఆఫ్ కండక్ట్ లోని లెవల్ 2ని అతిక్రమించినందుకు గానూ కోహ్లీ, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించారు. నవీన్ హుల్ హక్ కి అయితే 50 శాతం కోత విధించారు. దీనిబట్టి చూస్తే.. గ్రౌండ్ లోనే ఆల్మోస్ట్ కొట్టుకునేంతవరకు వెళ్లిన కోహ్లీ-గంభీర్ తిక్కని బీసీసీఐ కుదిర్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 126/9 స్కోరు చేసింది. దీన్ని ఛేదించలేకపోయిన లక్నో.. 108 పరుగులకు ఆలౌటైంది. సరే ఇదంతా పక్కనబెడితే కోహ్లీ-గంభీర్ గొడవలో తప్పెవరిదని అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
All fights from LSG vs RCB#LSGvsRCB #Kohli #Gambhir #Mishra #naveen #ipl #mayers pic.twitter.com/09rgro5CN3
— SRK FAN (@King_Of_World_) May 1, 2023