రోహిత్ సారథ్యంలోని ముంబయీ గెలిచింది. బెంగళూరు మురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. ఇదేంటబ్బా.. ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో బెంగుళూరు పేరు ఎందుకు వచ్చిందనే కదా మీ సందేహం. ఢిల్లీ కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంతా అనుకున్న వేళ ముంబై ఇండియన్స్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుకుంది. బ్యాటింగ్ వైఫల్యం.. ఫిల్డింగ్ విఫలం.. నాయకత్వంలో తప్పిదంతో ఢిల్లీ చేజేతులారా ఓటమి పాలైంది. శనివారం జరిగిన ముంబై, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ముంబై.. ఢిల్లీపై విజయం సాధించింది. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్ డేవిడ్.. మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ టీమ్ డేవిడ్ విజృభించాడు. 11 బంతుల్లో 34 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం టీమ్ డేవిడ్ మాట్లాడుతూ..”ఢిల్లీతో మ్యాచ్ జరిగే రోజు ఉదయం నాకు డుప్లెసిస్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ ముంబై ఇండియన్ జెర్సీ ధరించి ఉన్నారు” అని అన్నాడు. అయితే ఒక విధంగా వాళ్ల కోసమే ఈ మ్యాచ్ ని గెలిచాము అన్నట్లు పరోక్షం తెలిపారని కొందరు అభిప్రాయపడ్డారు.ఇక మ్యాచ్ విషయంలోకి వెళ్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న క్రికెటర్ రాబిన్ ఉతప్ప భార్య.. ఫోటోస్ వైరల్!
పావెల్ (43), పంత్ (39) రాణించారు. బుమ్రాకు మూడు, రమణ్దీపనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఇషాన్ (48), బ్రెవిస్ (37), డేవిడ్ (11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34) ఆదుకున్నారు. నోకియా, శార్దూల్లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా బుమ్రా నిలిచాడు. ముంబై విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్ వెళ్లింది. మరి.. టీమ్ డేవిడ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.