ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ఢిల్లీ బ్యాటర్ కుల్దీప్ యాదవ్ మెడపై చేయి పెట్టి తోశాడు. ప్రస్తుతం చాహల్ అలా చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఇది ఒక సీరియస్ ఇష్యూలో జరిగిన ఫన్నీ సంఘటన. చాహల్, కుల్దీప్ మంచి స్నేహితులు.. మరి చాహల్ ఇలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చదవాల్సిందే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీనికి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ధీటుగానే జవాబు చెప్పింది.
లక్ష్య ఛేదనలో డీసీకి చివరి ఓవర్లో 36 పరుగులు అవసరం అయ్యాయి. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెక్కాయ్ బౌలింగ్కు దిగాడు. క్రీజులో ఢిల్లీ ఆల్రౌండర్ రోవ్మెన్ పావెల్ ఉన్నాడు. మెక్కాయ్ వేసిన మొదటి బంతికి పావెల్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. రెండో బంతికి కూడా సిక్సుతో బదులిచ్చాడు. దీంతో సమీకరణం 4 బంతులకు 24 పరుగులకు చేరుకుంది. పావెల్ విరుచుకుపడుతుండడంతో బౌలర్ మెక్కాయ్ బౌలింగ్లో లయ తప్పాడు. మూడో బంతిని ఫుల్ టాస్గా విసిరాడు. దాన్ని కూడా పావెల్ గుంజి కొట్టడంతో బంతి స్టాండ్స్లో పడింది. వరుసగా ఢిల్లీకి మూడు సిక్సర్లు రావడంతో 3బంతుల్లో 18పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది.అయితే ఇక్కడే వివాదం రాజుకుంది. మూడో బంతి ఫుల్ టాస్.. బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం దాన్ని నోబాల్గా ప్రకటించలేదు. డగౌట్లో కూర్చున్న ఢిల్లీ టీం అది నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు. అలాగే పావెల్ సైతం అంపైర్ వద్దకు వెళ్లి.. నా నడుము కంటే ఎత్తులో వచ్చింది అది కంప్లీట్ నోబాల్.. మీరు నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్తో వాదించాడు. కానీ నితిన్ మీనన్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. అది ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు. దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి సైగచేశాడు. పావెల్, కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు.
అప్పుడు పిచ్ వద్దే ఉన్న చాహల్.. కుల్దీప్ను బయటికి వెళ్లకుండా సముదాయించే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో చాహల్ కాస్త చనువుగా.. వెళ్లి బ్యాటింగ్ చేయ్పో అన్నట్లు తోశాడు. ఇది చాలా సరదాగానే జరిగింది. అయినా కూడా కుల్దీప్ పంత్ పిలుస్తున్నాడు రా.. బాబు.. వెళ్లాలి అన్నట్లు చెప్తున్నాట్లు అర్థం అవుతుంది. కాగా ఇంతలో షేన్ వాట్సన్ పంత్ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. తర్వాత పావెల్ మిగతా 18 పరుగులు చేయలేకపోయాడు. చివరి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 15 పరుగులతో విజయం సాధించింది. మరి చాహల్, కుల్దీప్ మధ్య సరదా సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: పొలార్డ్ బలాన్నే బలహీనతగా మార్చిన ధోని! ఇదిగో సాక్ష్యం..
@azharflicks meanwhile Kuldeep and Chahal 😂😂 pic.twitter.com/Fxb9CTTmAN
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.