ఐపీఎల్ 2022 కీలక దశకు చేరుకుంది. అన్ని దాదాపు అన్ని జట్లుకు ఒక్కటే మ్యాచ్ మిగిలి ఉన్నా ఒకే ఒక్క జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్కు చేరింది. అలాగే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్ రేస్నుంచి తప్పుకున్నాయి. అంటే మూడు ప్లేఆఫ్ స్థానాల కోసం ఏకంగా 7 జట్లు పోటీలో ఉన్నాయి. లక్నో, రాజస్థాన్ దాదాపు ప్లేఆఫ్ చేరినట్లే. ఇక మిగిలిన ఒక స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ మద్దతు దారులుగా మారిపోయారు.
ఎందుకంటే ముంబై గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ.. గురువారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడితే.. రన్రేట్తో పనిలేకుండా ఆర్బీసీ ప్లేఆఫ్ చేరుతుంది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఇప్పుడు ముంబైకి కొత్త మద్దతుదారులుగా మారిపోయారు. ఈ నెల 21 శనివారం ఢిల్లీ ముంబైతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే ఆర్సీబీ అభిమానులు ముంబైని ఎంకరేజ్ చేస్తున్నారు.అలాగే ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లో కూడా తమ మద్దతు ముంబై అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. దీనికి కూడా ఒక కారణం చెప్తున్నారు. ఢిల్లీతో మ్యాచ్ కంటే ముందే ముంబై గెలుపు బాట పడితే మరింత ఎనర్జీతో ఢిల్లీతో ఆడుతుందని వారి ఆశ. అందుకే SRHతో మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధించాలని ఆర్సీబీ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sourav Ganguly: రోహిత్ శర్మ, కోహ్లీల ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్ గంగూలీ
RCB fans right now 😅 pic.twitter.com/88iyZzwXVn
— RVCJ Media (@RVCJ_FB) May 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.