ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. ఆ చెత్త రికార్డు ఈ సీజన్కే కాక ఐపీఎల్ చరిత్రలోనే తొలి సారి నమోదైంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఈ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఈ సీజన్లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న CSK.. ఈ చెత్త రికార్డుతో అప్రతిష్టను మూటగట్టుకుంది. గుజరాత్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49బంతుల్లో 4ఫోర్లు 1సిక్స్), ఎం జగదీషన్ (39పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్స్) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133పరుగులు మాత్రమే చేసింది.
గుజరాత్ టైటాన్స్కు 134 పరుగుల స్వల్ప టార్గెట్ విధించింది. గుజరాత్ టైటాన్స్ ఎటాకింగ్ బౌలింగ్తో చెన్నై బ్యాటర్లు తేలిపోయారు. ముఖ్యంగా షమీ బౌలింగ్లో ఆడడానికి బ్యాటర్లు వణికిపోయారు. డెత్ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. చేతిలో వికెట్లు ఉన్నా కూడా ఒక్క ఫోర్ కానీ, సిక్స్ కానీ చెన్నై బ్యాటర్ల నుంచి రాకపోవడం గమనార్హం. ఇలా ఐపీఎల్ చరిత్రలో చివరి ఐదు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టని ఏకైక జట్టుగా CSK చెత్త రికార్డును నమోదు చేసింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై కనీసం 150 లేదా 160 పరుగుల స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు కేవలం 24 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో 8 వికెట్లు పెట్టుకుని 30 బంతుల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేయడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి. పైగా జట్టు ఆలౌట్ కూడా కాలేదు. 8 వికెట్లు ఉన్నా ధోనీతో సహా చెన్నై బ్యాటర్లెవరు ధాటిగా ఆడలేదు. ఫలితంగా 133 పరుగులకే చెన్నై పరిమితమైంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి చివరి బంతికి రుతురాజ్ను అవుట్ చేశాడు. తర్వాత 17వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్కు దిగగా.. 3వ బంతికి శివమ్ దూబే డకౌట్ అయ్యాడు. ఇక ఈ ఓవర్లో ధోనీ బరిలోకి దిగినా కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి.
ఇక 18వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ చేయగా ఆ ఓవర్లో ధోనీ, ఎం జగదీషన్ టెస్టును మరిపించేలా ఆడారు. దీంతో మళ్లీ 3 పరుగులే వచ్చాయి. ఇక మిగిలిన రెండు ఓవర్లలోనైనా హిట్టింగ్ చేస్తారేమోనని ఎదురుచూస్తే.. 19వ ఓవర్ యష్ దయాళ్ వేయగా ఆ ఓవర్లోనూ చెన్నై తన టెస్ట్ ఇన్నింగ్స్ కొనసాగించి ఆ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. అందులో మూడు వైడ్లే. ఇక ఆఖరి ఓవర్ మహ్మద్ షమీ వేయగా 3వ బంతికి ధోనీ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్లోనూ 6పరుగులే వచ్చాయి. ఇలా చివరి ఐదు ఓవర్లలో చెన్నై బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. ఇక 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి చెన్నై టీమ్ నమోదు చేసిన చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravichandran Ashwin: అనుకున్నదొక్కటి అయిందొక్కటి! రివర్స్ అయిన అశ్విన్ రనౌట్ ప్లాన్
Not our day, but new rays of hope 💛#CSKvGT #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/d5EE3PcdlZ
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.