మారిన కాలానికి అనుగుణంగా ఇప్పడు చాల మంది ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. తాజా కూరగాయలు, మిగిలిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటివి భద్రపరుచుకుని తర్వాత తింటున్నారు. అసలు ఫ్రిజ్ లో పెట్టిన ఆహారం తినడం మంచిదేనా? ఇలా ఫ్రిజ్ లో దాచి పెట్టిన ఆహారం తినడం వల్ల ఏమైన దుష్ప్రభావాలు ఉన్నాయా? అసలు నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో ఫ్రిజ్ ఉంటుంది. కూరగాయలు చెడిపోకుండా ఉండటానికి వాటిని ఫ్రిజ్ ను ఉపయోగిస్తున్నారు. ఇక అసవరం వచ్చినప్పుడల్లా ఫ్రిజ్ లోంచి కూరగాయలు తీసి వండకుని తింటూ ఉంటారు. ఇదే కాకుండా రాత్రి మిగిలిన ఆహారాలను సైతం ఫ్రిజ్ లో ఉంచి ఉదయాన్నే మళ్లీ తింటున్నారు. ఇలా ఫ్రిజ్ లో ఉంచిన ఆహారాలు తినడం ద్వారా లేని పోని రోగాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినటానిక భయంకరంగా ఉన్నా ఇది నిజం. అసలు నిపుణులు ఏం చెబుతున్నారంటే? వండిన 45 నిమిషాల్లోపే తినేయాలని లేకుంటే అది విషతుల్యం కిందకు వస్తుందని అంటున్నారు. వండిన ఆహారం 45 నిమిషాలు దాటిన తర్వాత ఆ ఆహారంపై వేల సంఖ్యలో సుక్ష్మ జీవులు దాడి చేస్తాయని తెలియజేస్తున్నారు.
అలా సుక్ష్మజీవులు దాడి చేసిన ఆహారాన్ని తినడం మనం తినడం ద్వారా ఫుడ్ ఫాయిజన్ తో పాటు లేనిపోని సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లవుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక కూరగాయాలను సైతం ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదట. ప్రిజ్ లో దాచిన పాలను తీసి టీ పెట్టుకోవడం కూడా అది ప్రమాదం కిందకే వస్తుందని తెలియజేస్తున్నారు. ఇకపోతే కూరగాయలను వారానికి మించి ఫ్రిజ్ లో ఉంచకూడదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఫ్రిజ్ ను వాడడం అనేది ప్రమాదకరమేనని, వాడకపోవడమే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.