ఒకప్పుడు వార్తలు తెలియాలంటే.. పేపర్ చదివేవాళ్లం. ఆ తర్వాత నెమ్మదిగా టీవీల్లో వార్తలు ప్రసారం చేయసాగారు. కొన్నాళ్లకు.. 24 గంటలు వార్తలు ప్రసారం చేయడం కోసం ప్రత్యేకంగా చానెల్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మాత్రం డిజిటల్ చానెల్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం యూట్యూబ్లో లెక్కలేనన్ని చానెల్స్ ఉన్నాయి. వీటికి తోడు.. అన్ని ప్రధాన న్యూస్ చానెల్స్.. యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం చేస్తున్నాయి. ఇంతటి తీవ్ర పోటీలోను తనదైన ముద్ర వేస్తూ.. డిజిటర్ రంగంలో నంబర్ వన్ చానెల్గా దూసుకుపోతోంది సుమన్ టీవీ. Suman Dudi (Owner, Chairman) ఆలోచన నుండి పుట్టుకొచ్చిన సుమన్ టీవీ సంస్థ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు మహా వృక్షంగా మారి.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. డిజిటిల్ రంగంలో నంబర్ వన్ చానెల్గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. సుమన్ టీవీ యూట్యూబ్ ఛానెల్ 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ను అందుకుంది.
ఒక యూట్యూబ్ చానెల్కి 60 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ చానెల్ పట్ల ప్రజల్లో ఎంతో విశ్వసనీయత ఉంటే తప్ప.. ఇలాంటి మైలు రాయి చేరుకోవడం కష్టం.సమాజంలో చోటు చేసుకునే ప్రతి అంశాన్ని వెంటనే ప్రజలకు చేరవేయడమే కాక.. జనాలు మెచ్చే.. వారికి ఉపయోగ పడే విలువైన సమాచారాన్ని అందిస్తూ.. ముందుకు సాగుతోంది సుమన్ టీవీ. ఇక సుమన్ టీవీ 6 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ మైలు రాయిని చేరుకున్న నేపథ్యంలో.. SumanTV (Owner & CEO) Suman Dudi సబ్స్క్రైబర్స్కు ధన్యవాదాలు తెలిపారు.
‘‘మమ్మల్ని ఇంతలా ఆదరించి.. మద్దతుగా నిలిచిన సబ్స్క్రైబర్స్కు సదా కృతజ్ఞుడనయి ఉంటాను.. సబ్స్క్రైబర్లు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానీయను. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఉంటూ.. నిజాలను ప్రజలు ముందుకు తీసుకురావాడానికి కృషి చేస్తాను. వాస్తవాలను ప్రజలకు తెలియజేడమే సుమన్ టీవీ ప్రధాన ఎంజెడా. 6 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ మైలు రాయిని చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా పట్ల ఇంతటి ప్రేమాభిమానులు చూపుతున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని అన్నారు సుమన్ టీవీ Founder, Chairman & CEO – Suman Dudi.