అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందువుల పండుగలను ముస్లింలు గౌరవిస్తుంటారు. రంజాన్ మాసాన్ని హిందువులు సైతం పవిత్ర దినాలుగా భావిస్తుంటారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
భారత్ సర్వమత సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వానికి కట్టుబడి ఉంటుంది. అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అని సంబోధించుకుంటారు. సంక్రాంతి మొదలుకుని క్రిస్టమస్ వరకు ప్రతి పండుగనూ తమ తమ మతాలకు ప్రాధాన్యనిస్తూనే..ఇతర మతస్థుల పండుగులను గౌరవిస్తారు. హిందువుల పండుగల సమయంలో ఇంట్లో వండుకునే ప్రసాదాలు పొరుగున ఉన్న ముస్లిం, క్రైస్తవుల ఇళ్లకు చేరతాయి. అదేవిధంగా రంజాన్ నెలలో ముస్లింలు పాటించే నమాజ్ ప్ర్రక్రియను హిందువులు గౌరవిస్తారు. అదేవిధంగా క్రిస్ మస్ రోజున వారు.. అన్ని మతస్తుల వారు జీసెస్ను తలచుకుంటారు. భక్తి శ్రధ్దలతో పూజలు చేస్తారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
హిందువులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రీతికరమైన పండుగ అంటే ఉగాది. ఈ పండుగను అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాయి. అయితే ఏపీలోని కడపలో ఈ పండుగను ముస్లింలు కూడా బాగా జరుపుకుంటారు. దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దేవాలయంలో హిందువులతో పాటు ముస్లిం భక్తులు పెద్ద యెత్తున దర్శించుకుంటారు. ఆ రోజు వెంకటేశ్వరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు ముస్లింలు. అయితే దీని వెనుక చారిత్రాత్మకమైన ఆధారాలున్నాయని తెలుస్తోంది. వెంకటేశ్వరుని భార్య పద్మావతికి గోదా దేవీ, లక్ష్మిదేవీ అని నామధేయాలు ఉన్నాయి. ముస్లింలు.. బీబీ నాంచారమ్మ మా దేవత అని భావిస్తుంటారు. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వరుడ్ని మనువాడిందీ కాబట్టి.. ఆయనను వారి ఇంటి అల్లుడిగా భావిస్తుంటారు మహ్మదీయులు.
అందుకే ప్రతి ఏడాది ఉగాది నాడున శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దేవాలయాన్ని సందర్శించి, ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారట. ఆలయానికి చేరుకుని పూలు, పండ్లు, కొ్బ్బరికాయలు సమర్పిస్తారు. వీటితో పాటు బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకు వచ్చి వెంకన్నకు నైవేద్యాలు సమర్పిస్తారట. ఈ ఆచారం ఏళ్ల తరబడి నుండి ఆనవాయితీగా వస్తుంది. దీంతో దాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు ముస్లిం భక్తులు. ఉగాది రోజున వెంకటేశ్వరున్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వారు విశ్వసిస్తుంటారు. అదేవిధంగా ఆయనకు నైవేద్యంగా సమర్పించే ఉగాది పచ్చడిని కూడా ముస్లిం భక్తులు స్వీకరిస్తారు. ఇంకా చెప్పాలంటే.. ఈ రోజున హిందువుల కంటే ముస్లిం భక్తులు ఎక్కువ మంది వస్తుంటారట.