నేటి కాలంలో ఇప్పటికి కూడా చాలామంది జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..? సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయోచ్చా? చేయకూడదా అనే సందేహాలు చాలామందికి తెలెత్తుతుంటాయి. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయొద్దంటూ జ్యోతీష్యశాస్త్రం తెలియజేస్తుంది. ఒకవేళ పొరపాటున చేస్తే గనుక ఇబ్బందులు తప్పవని కూడా జ్యోతీష్యులు హెచ్చరిస్తున్నారు. ఇక సూర్యాస్తమయం తర్వాత ఏయే పనులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పెరుగు లేనిది ముద్దదిగని ఈ రోజుల్లో చాలామంది పక్కంటి వాళ్లకు పెరుగును ధానం చేస్తుంటారు. ఇలా చేస్తే సంతోషం మన నుంచి దూరమవుతుందని తెలుస్తోంది.నేటికాలంలో చాలామంది యువత సూర్యాస్తమయం తర్వాత ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ నిద్రపోతుంటారు. ఇలా చేయకూడదని జ్యోతీష్యులు తెలుపుతున్నారు. ఆహారం కూడా తీసుకోవద్దని కూడా సూచిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. సూర్యాస్తమయం తర్వాత చాలా మంది ఇళ్లు ఊడుస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని జ్యోతీష్యుల చెబుతున్నారు.
చాలా మంది సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను పట్టుకోవడం లేదా నీరు పోయడం చేస్తు ఉంటారు. కానీ అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని జ్యోతీష్యులు చెబుతున్నారు.సమయం పాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు, వెంట్రుకలు కత్తరిస్తూ ఉంటారు. ఇలా సూర్యాస్తమయం తర్వాత ఇలా చేసినవారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతీష్య శాస్త్రం చెబుతోంది.